Telangana: విద్యార్థులు ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

|

Jul 19, 2022 | 10:11 AM

Telangana: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్ పంపిణీ చేశారు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు.

Telangana: విద్యార్థులు ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Photo
Follow us on

Telangana: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్ పంపిణీ చేశారు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు. విద్యార్థులు అందరూ కష్టపడి చదువుకోవలన్నారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని.. మీకోసం మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని మరువకూడదన్నారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

పేద విద్యార్థుల మెరుగైన విద్య కోసం ప్రభుత్వం మన ఊరు మన బడి పేరుతో మంచి విద్య, మధ్యాహ్నం భోజనం కార్యక్రమం చెప్పట్టిందన్నారు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు. పిల్లలు అందరూ బాగా చదువుకోవాలని, పాఠ్య పుస్తకాలు ప్రభుత్వం ఇచ్చినప్పటికి నోట్ బుక్స్ కొనడానికి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే వారి కోసం కొంత మంది దాతల సహాయంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పేద విద్యార్థులు 25వేల మందికి ఉచిత గా నోట్ బుక్స్ పంపిణీ చేసారు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు.

పిల్లలకు బుక్స్ అందించడం చాలా ఆనందాన్ని కలిగించింది అని అన్నారు ఎమ్మెల్సీ. పిల్లలకు కావాల్సిన సదుపాయాల బాధ్యత తనదని, కానీ కష్టపడి చదివి అందరి పేరు నిలబెట్టాల్సిన బాధ్యత మీది అని పిల్లలతో అన్నారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి ఎమ్మెల్సీగా ఎదిగానని.. మీరూ కష్టపడితే ఏదైనా సాధించవచ్చని అన్నారు. కాగా, తమ కోసం ఇలా బుక్స్ ఇవ్వడం హ్యాపీగా ఉందని, ఎమ్మెల్సీ చెప్పినట్టు కష్టపడి చదివి అందరి పేరు నిలబెడతామని అన్నారు విద్యార్థులు. ప్రతి ఒక్క విద్యార్థికి ఆరు నోట్ బుక్ లు అందించడం చాలా యూస్ ఫుల్ అని అన్నారు విద్యార్థులు.

ఇవి కూడా చదవండి

మరిన్నితెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..