AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana MLC Elections : ఎం.ఎల్.సి ఎన్నికలకు సర్వం సిద్దం.. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్..

పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 14న (ఆదివారం) ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది.

Telangana MLC Elections : ఎం.ఎల్.సి ఎన్నికలకు సర్వం సిద్దం.. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్..
Mlc Polls
Rajeev Rayala
| Edited By: Team Veegam|

Updated on: Mar 14, 2021 | 12:29 PM

Share

Telangana MLC Elections : పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 14న (ఆదివారం) ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది. రెండు నియోజకవర్గాల్లో 1,530 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా.. 7,560 మంది సిబ్బందిని నియమించింది. మహాబుబ్‌నగర్- రంగారెడ్డి-హైదరాబాద్- వరంగల్-ఖమ్మం- నల్గొండ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.

మహాబుబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గం నుంచి 71 మంది నామినీలు బరిలో ఉన్నారు. 1,530 పోలింగ్ స్టేషన్లలో 10 లక్షలకు పైగా పట్టభద్రుల ప్రిఫరెన్షియల్ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా టిఆర్‌ఎస్ మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె ఎస్. వాణి దేవిని పోటీచేస్తున్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గం మాజీ మంత్రి జి చిన్న రెడ్డి (కాంగ్రెస్), టిడిపి తెలంగాణ యూనిట్ అధ్యక్షుడు ఎల్ రమణ మరియు ప్రముఖ విశ్లేషకుడు మాజీ ఎంఎల్‌సి కె నాగేశ్వర్ తదితరులు పోటీలో ఉన్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డిని టిఆర్‌ఎస్ నిలబెట్టింది, బిజెపి అభ్యర్థి జి ప్రీమేందర్ రెడ్డి. తెలంగాణ జన సమితి (టిజెఎస్) నాయకుడు ఎం. కోదండరం బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈనెల 17న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక పోలింగ్‌ ప్రశాంత నిర్వహణకు పోలీసుల ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు సీఈవో తెలిపారు. అదేవిధంగా రోనా నేపథ్యంలో కొవి డ్‌ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లుచేశామని, మాస్క్‌ ఉన్న ఓటర్లనే కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. కేంద్రాల వద్ద శానిటైజర్‌ను అందుబాటులో ఉంచడంతోపాటు, ఓట ర్లు భౌతికదూరం పాటించేలా మార్కింగ్‌చేసినట్టు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి :  MLA Ramulu Naik : ‘అవసరమైతే డబ్బులివ్వండి. ఇదంతా ఆఫ్‌ ది రికార్డ్‌, డోన్ట్‌ వర్రీ, నే చూసుకుంటా. కానీ.. మనమే గెలవాలి’

Telangana AP MLC Elections 2021 Live : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్