ఎంసెట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ యథాతథం.. స్పష్టం చేసిన ఉన్నత విద్యాశాఖ

ఎంసెట్ విద్యార్థలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు. ఇంటర్మీడియట్‌‌ మార్కుల వెయిటేజ్‌ యథాతథంగా కొనసాగింపు.

ఎంసెట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ యథాతథం.. స్పష్టం చేసిన ఉన్నత విద్యాశాఖ
Follow us

|

Updated on: Feb 05, 2021 | 4:22 PM

Intermediate weightage : ఫ ఎంసెట్ విద్యార్థలకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎంసెట్‌లో ఇంటర్మీడియట్‌‌ మార్కుల వెయిటేజ్‌ యథాతథంగా కొనసాగిస్తామని ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ స్పష్టం చేశారు. ఎంసెట్‌పై ఇవాళ విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌, సిలబస్‌ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

అయితే, కరోనా మహమ్మరి కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఈసారి ఎంసెట్‌లో ఇంటర్‌ తొలిఏడాది నుంచి 100 శాతం సిలబస్‌, ద్వితీయ ఏడాది నుంచి 70 శాతం సిలబస్‌ ఇవ్వనున్నట్లు చిత్రా రామచంద్రన్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఎంసెట్‌ సిలబస్‌ విడుదల చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. జూన్‌ 14 తరువాత ఎంసెట్‌ నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి వెల్లడించారు.

Read Also…  SSC MTS 2020 notification: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. నేడు వెలువడనున్న ఎస్‌ఎస్‌సి ఎమ్‌టిఎస్ నోటిఫికేషన్