KA Paul: కేఏ పాల్ భద్రతపై హైకోర్టు విచారణ.. నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఆదేశాలు

కేఏ పాల్ భద్రతపై హైకోర్టు విచారణ జరిగింది. పాల్ వేసిన పిటిషన్ ను డిస్మస్ చేశారు చీఫ్‌ జస్టిస్. 30 రోజుల్లోగా కేఏ పాల్ త్రెట్ ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది హైకోర్టు.

KA Paul: కేఏ పాల్ భద్రతపై హైకోర్టు విచారణ.. నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఆదేశాలు
Ka Paul
Follow us

|

Updated on: Feb 10, 2023 | 6:34 AM

భద్రత తొలగింపుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. భద్రతను తొలగించిందంటూ కేఏ పాల్ హైకోర్టుకు లెటర్ రాశారు. కేఏపాల్ లెటర్‌ను సుమోటోగా స్వీకరించి హైకోర్టు విచారణ చేపట్టంది. 30 రోజుల్లోగా కేఏ పాల్ త్రెట్ ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది హైకోర్టు. వాదనల సందర్భంగా సచివాలయం ఫైర్ యాక్సిడెంట్ ఘటనను కేఏ పాల్ ప్రస్తావించగా ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. జీపీ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలంలో అగ్నిప్రమాదం జరిగిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఘటన జరిగి వారం రోజులు గడిచినా ప్రమాదంపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు కేఏపాల్. పాత సచివాలయం నుంచి పది మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారని గుర్తుచేశారు.

500 కోట్ల భవనాన్ని కేవలం వాస్తు పేరుతో కూల్చేశారని.. కొత్త సచివాలయం పేరుతో 660 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హైకోర్టుకు చెప్పారు కేఏపాల్. అలాగు ప్రమాదం జరిగిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోందనీ వాదించారు పాల్. ఘటన జరిగి వారం రోజులైనా ఫైర్ యాక్సిడెంట్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదని.. సచివాలయం ప్రమాదంపై సీబీఐతో విచారణకు ఆదేశించాలని పాల్ వాదించారు. కేవలం మీ భద్రతపైనే వాదించాలని, ఇతర అంశాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారని కేఏ పాల్‌కు సూచించారు చీఫ్ జస్టిస్. పాల్ భద్రతపై నిర్ణయం తీసుకోవాలని డీజీపీకి ఆదేశిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles