AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. నిధుల విడుదలకు లైన్ క్లియర్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల మెడికల్ బిల్లులను క్లియర్ చేసింది. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. దీంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గత కొంతకాలంగా పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.

Telangana: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. నిధుల విడుదలకు లైన్ క్లియర్
Cm Revanth Reddy
Prabhakar M
| Edited By: |

Updated on: Apr 29, 2026 | 5:25 PM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రూ.1000 కోట్ల నిధులను బుధవారం విడుదల చేశారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం మార్చి 2026 వరకు చెల్లింపులు కొనసాగాయి. అయితే, ఉద్యోగుల ఆర్థిక అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి నెలవారీ విడుదలను రూ.1000 కోట్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

రూ.వెయ్యి కోట్లు విడుదల

ఈ నిర్ణయంతో ఏప్రిల్ నెలకు సంబంధించిన మొత్తం రూ.1000 కోట్లను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. దీని ద్వారా ఉద్యోగులపై ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఈ నిర్ణయం పెద్ద ఊరట కలిగించింది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల GPF బకాయిలన్నీ క్లియర్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఉద్యోగుల ఆరోగ్య అవసరాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెడికల్ బిల్లుల చెల్లింపులను వేగవంతం చేసి, ఆలస్యం లేకుండా క్లియర్ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం మెడికల్ బిల్లులు ప్రాధాన్యతగా చెల్లిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పెండింగ్ బకాయిల విడుదల, GPF క్లియర్, మెడికల్ బిల్లుల చెల్లింపుల వేగవంతం అన్ని కలిపి ఉద్యోగులకు గణనీయమైన ఉపశమనం కలిగించాయి. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Follow Us