AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రేషన్‌ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. బియ్యం విషయంలో కీలక నిర్ణయం.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో పేదలకు బలవర్ధక బియ్యం అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఏప్రిల్‌ నుంచి 11జిల్లాల కార్డుదారులందరికీ ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేయనున్నారు. ఐరన్, ఫోలిక్ యాసిడి, విటమిన్ బి12లతో కూడిన బియ్యంతో ప్రజలకు సంపూర్ణ పోషణ లభిస్తుందని..

Telangana: రేషన్‌ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. బియ్యం విషయంలో కీలక నిర్ణయం.
Ration Card
Narender Vaitla
|

Updated on: Mar 28, 2023 | 7:23 PM

Share

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో పేదలకు బలవర్ధక బియ్యం అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఏప్రిల్‌ నుంచి 11జిల్లాల కార్డుదారులందరికీ ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేయనున్నారు. ఐరన్, ఫోలిక్ యాసిడి, విటమిన్ బి12లతో కూడిన బియ్యంతో ప్రజలకు సంపూర్ణ పోషణ లభిస్తుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పేదలందరికీ సంపూర్ణ పోషకాహారం అందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు.

ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఐసీడీఎస్, మధ్యాహ్న బోజన పథకాలతో పాటు 11జిల్లాల పరిధిలో ఉన్న ప్రతీ రేషన్ కార్డుదారుకు బలవర్ధక బియ్యాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే బలవర్ధక బియ్యం పంపిణీని 2021 సెప్టెంబర్లో జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో ఫైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఐసీడిఎస్, మద్యాహ్నభోజన పథకం, హాస్టళ్లకు అందించింది. అనంతరం మే 2022 నుండి ఆదిలాబాద్, అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రజాపంపిణి చేస్తుంది, తాజాగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండా, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, వికారాబాద్ పరిధిలో ఏప్రిల్ నెలలో బలవర్ధక బియ్యం పంపిణీకి సర్వం సిద్దం చేసింది.

బియ్యం పంపిణీ విషయమై మంత్రి గంగుల కమలాకర్ పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం తన నివాసంలో సమీక్షా నిర్వహించారు. గ్రామీణ, పట్టణ పేద ప్రజలు పోషకాహార లోపంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్య పోషకాలైన ఐరన్, ఫోలిక్ ఆసిడ్, బీ12 విటమిన్లతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ఉన్న బలవర్థక బియ్యంను రేషన్ ద్వారా పంపిణీ చేస్తామన్నామని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..