తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. ప్రధాని, సీఎం రేవంత్ సహా పలువురి శుభాకాంక్షలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. జాతీయ పురోగతికి తెలంగాణ కృషి చేసిందన్నారు. తెలంగాణ ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు.. దశాబ్ద కాలంగా ఎన్డీఏ అనేక చర్యలు చేపట్టిందన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలి, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు

ప్రజలంతా కలిసి కట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పడి పదకొండేళ్ళు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమర వీరుల త్యాగాలను ఈ సందర్బంగా స్మరించుకున్నారు సీఎం.
ఆహార్యంలో ఆత్మగౌరవం… ఆ రూపంలో నిండుదనం… తెలంగాణ తల్లికి… సదా సర్వదా నీరాజనం.#TelanganaTalli #TelanganaRising #TelanganaFormationDay2025 pic.twitter.com/v7oS9p9BCW
ఇవి కూడా చదవండి— Revanth Reddy (@revanth_anumula) June 2, 2025
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని.. ఆర్థిక, సాంకేతిక, పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి మార్గంలో ముందుకుసాగాలని ఆకాంక్షించారు రాష్ట్రపతి
Warm greetings to the people of Telangana on Statehood Day! This young State has a rich cultural heritage and a vibrant modern ecosystem of economic and technological development. I wish that the people of Telangana march ahead on the path of progress and prosperity.
— President of India (@rashtrapatibhvn) June 2, 2025
— తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. జాతీయ పురోగతికి తెలంగాణ కృషి చేసిందన్నారు. తెలంగాణ ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు.. దశాబ్ద కాలంగా ఎన్డీఏ అనేక చర్యలు చేపట్టిందన్నారు ప్రధాని మోదీ.
Warm greetings to the people of Telangana on Statehood Day! This young State has a rich cultural heritage and a vibrant modern ecosystem of economic and technological development. I wish that the people of Telangana march ahead on the path of progress and prosperity.
— President of India (@rashtrapatibhvn) June 2, 2025
— పదకొండేళ్ల క్రితం మన్మోహన్సింగ్, సోనియాగాంధీ నాయకత్వంలో.. తెలంగాణ రాష్ట్రం పురుడుపోసుకుందన్నారు రాహుల్గాంధీ. కోట్ల మంది ప్రజల ఆశలు, కలలకు కాంగ్రెస్ ఒక రూపాన్ని ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అంటూ ట్వీట్ చేశారు రాహుల్.
Wishing the people of Telangana a very Happy Statehood Day!
11 years ago, under the leadership of Dr. Manmohan Singh ji and Smt. Sonia Gandhi ji, Telangana was born – giving shape to the hopes and dreams of millions.
My heartfelt tributes to all who gave their sweat and… pic.twitter.com/fW9BF6IjDn
— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2025
— రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, జాతి ఒక్కటే అంటూ.. తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలని కోరారు. తెలంగాణలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలి, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు ఏపీ సీఎం చంద్రబాబు.
#TelanganaFormationDay తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో…
— N Chandrababu Naidu (@ncbn) June 2, 2025
— జనసేనకు జన్మనిచ్చిన నేల..తనకు పునర్జన్మనిచ్చిన నేల.. తన ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల తెలంగాణ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. తెలంగాణ 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు పవన్.
జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో…
— Pawan Kalyan (@PawanKalyan) June 2, 2025