తెలంగాణలో కొనసాగుతున్న కరోనా తీవ్రత.. కొత్త 147 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ
తెలంగాణలో కొత్తగా 147 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు.
Telangana coronavirus cases : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతునే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 147 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు. తాజా కేసులతో కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,737కి చేరింది.
కాగా, కరోనా మహమ్మారి బారినపడి ఇవాళ మరొకరు మృత్యువాత పెట్టారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,593కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,819 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపిన అధికారులు.. 1,593 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఇక, గడిచిన 24 గంటల్లో 399 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,89,325 చేరింది.
ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో 16,486 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 77,28,296కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.54శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.9శాతం ఉండగా తెలంగాణలో 98.49 శాతం ఉన్నట్లు తెలిపారు.
Read Also… క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి… పురుగుల మందు తాగి ఆత్మహత్య