AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Narasimha Rao: దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన పీవీ నరసింహా రావు వర్ధంతి సంద‌ర్భంగా ఘన నివాళి..

పీవీ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు పీవీ ఘాట్‌లో నివాళులు అర్పించారు. పీవీ దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన కీర్తిని పెంచేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

PV Narasimha Rao: దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన పీవీ నరసింహా రావు వర్ధంతి సంద‌ర్భంగా ఘన నివాళి..
Tribute To Pv Narasimha Rao
Balaraju Goud
|

Updated on: Dec 23, 2023 | 2:42 PM

Share

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహా రావు 19వ వర్ధంతి సంద‌ర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వ‌ద్ద రేవంత్ రెడ్డి నివాళుల‌ర్పించారు. పీవీ దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన కీర్తిని పెంచేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు.

పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ నరసింహా రావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారని అన్నారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్‌లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని రేవంత్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు పీవీ ఘాట్‌లో నివాళులు అర్పించారు. పీవీ ఘాట్‌లో ఘన నివాళులర్పించారు బీజేపీ నేత ఈటల రాజేందర్‌. పీవీ నర్సింహరావు… కరీంనగర్‌ మట్టి బిడ్డ.. ముద్దు బిడ్డ అంటూ ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.

ఇక ఢిల్లీలో జరిగిన పీవీ నరసింహారావు 19వ వర్థంతి కార్యక్రమాంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఆయనను దేశానికి ప్రధానమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పీవీని కాంగ్రెస్ ప్రధానిని చేసిందని గుర్తు చేశారు. పీవీ వర్థంతి సందర్భంగా పత్రికా ప్రకటనలు ఇవ్వాలని వి హనుమంతరావు ప్రభుత్వానికి సూచించారు. రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ