AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దైవాన్ని కూడా వదలని స్మగ్లర్స్.. దేవుడు రథంలో అక్రమ దందా.. పోలీసులకే షాక్..

దేవుడు ప్రచార రథానికి ఒక వైపు శిరిడి సాయిబాబా మరొకవైపు హనుమంతుని ఫ్లెక్సీలతో అందంగా అలంకరించి లోపల అమ్మవారి విగ్రహాన్ని పెట్టి 1 కోటి 20 లక్షల రూపాయల విలువచేసే 484 కేజీల గంజాయిని తరలిస్తూ భద్రాచలం పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. గంజాయిని తరలిస్తున్న విధానం చూసి పోలీసులే అవాక్కయ్యారు. జల్సాలకు అలవాటు పడిన వీరు దేవుడికి అడ్డం పెట్టుకుని ప్రచార రథంగా తయారు చేసి 1 కోటి 21 లక్షల విలువైన 484 కేజీల గంజాయిని తరలిస్తూ భద్రాచలం పోలీసులకు చిక్కారు.

Telangana: దైవాన్ని కూడా వదలని స్మగ్లర్స్.. దేవుడు రథంలో అక్రమ దందా.. పోలీసులకే షాక్..
Ganja Smuggling
N Narayana Rao
| Edited By: |

Updated on: Dec 12, 2023 | 7:05 PM

Share

భక్తుల ముసుగు వేసుకొని గంజాయిని తరలిస్తున్నారు. కానీ వీరు భక్తులు కాదు. సాధారణంగా దేవుడు పేరు వినగానే రెండు చేతులు జోడించి చేసిన తప్పులు క్షమించు నాయనా అని చెంపలేసుకుని దండం పెట్టుకుంటాం. కానీ భక్తుల ముసుగులో ఉన్న ముఠా మాత్రం ఏకంగా దేవుడు ప్రచార రథానికి ఒక వైపు శిరిడి సాయిబాబా మరొకవైపు హనుమంతుని ఫ్లెక్సీలతో అందంగా అలంకరించి లోపల అమ్మవారి విగ్రహాన్ని పెట్టి 1 కోటి 20 లక్షల రూపాయల విలువచేసే 484 కేజీల గంజాయిని తరలిస్తూ భద్రాచలం పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. గంజాయిని తరలిస్తున్న విధానం చూసి పోలీసులే అవాక్కయ్యారు.

జల్సాలకు అలవాటు పడిన వీరు దేవుడికి అడ్డం పెట్టుకుని ప్రచార రథంగా తయారు చేసి 1 కోటి 21 లక్షల విలువైన 484 కేజీల గంజాయిని తరలిస్తూ భద్రాచలం పోలీసులకు చిక్కారు. ఈ హైటెక్ ముఠా వివరాల్లోకి వెళ్తే

ఇవి కూడా చదవండి

హర్యానకు చెందిన మున్షిరం, బగత, గోవింద్ లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదనే ధ్యేయంగా గంజాయి వ్యాపారంగా ఎంచుకొని ఒక ఆటోని కొనుగోలు చేసి దేవుని ప్రచార రథంలా తయారు చేసి భక్తుల వేషం ధరించి ఒరిస్సా సరిహద్దుల్లోని కలిమెల పరిసర ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి హర్యానాలో చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అవసరమైన వ్యక్తులకు అమ్మడానికి అక్రమంగా తరలిస్తుండగా భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఈ ముగ్గురు పట్టుబడ్డారు.

ఈ నిందితుల వద్ద 484 కిలోల గంజాయి ఒక ఆటో, రెండు సెల్ ఫోనులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఒక కోటి 21 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. భద్రాచలం టౌన్ సిఐ నాగరాజు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ