AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో దేవుడా.. పండగ కోసం వచ్చారు.. తిరిగి వెళ్దామనేలోపే.. అంతులేని విషాదం

ఆ ఇద్దరు స్నేహితులు హైదరాబాద్‌లో ఉంటూ చదవుకుంటున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సొంతూరుకు వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా పండగ జరుపుకున్నారు. అమ్మానాన్నలతో కలిసి సరదాగా గడిపారు. మరో రెండు రోజుల్లో హైదరాబాద్ వెళ్లేందుకు ప్లాన్ చేశారు. కానీ ఇంతలోనే విధి వక్రీకరించింది. పక్కూర్లో ఉన్న ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఆ ఇద్దరు యువకులు చనిపోయారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Telangana: అయ్యో దేవుడా.. పండగ కోసం వచ్చారు.. తిరిగి వెళ్దామనేలోపే.. అంతులేని విషాదం
Jagtial Road Accident
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jan 18, 2026 | 9:10 PM

Share

సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వచ్చిన ఇద్దరు స్నేహితులు మరో ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన జిగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. పండగకు వచ్చిన కుమారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఇద్దరి యువకుల కుటుంబ సభ్యులుల గుండెలుపగిలేలా రోధించారు. పండగపూట చోటుచేసుకున్న ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో చదువుకుంటున్న జగిత్యాల జిల్లాకు చెందిన నవనీత్, సాయి, సృజన్ సంక్రాంతి సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా పండుగ జరుపుకున్నారు. మరో రెండ్రోజుల్లో తిరిగి హైదరాబాద్‌ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.

అయితే తమ పక్క ఊర్లోనే ఉన్న మరో ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లారు. అక్కడ మరో ఫ్రెండ్ తో కలిసి వింధు చేసుకున్నారు. తరువాత కార్‌లో ఇంటికి బయలుదేరారు. అయితే మార్గ మధ్యలోకి రాగానే ఓవర్ స్పీడ్ కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్థంబానికి ఢీకొట్టింది. అనంతరం డివైడర్ డీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన యువకులను హాస్పిటల్‌కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే హాస్పిటల్‌లో వారిని పరీక్షించిన వైద్యులు నవనీత్, సాయి తేజ అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉన్న సృజన్‌కు చికిత్స అందించారు.

ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి యాక్సిడెంట్ జరిగిన తీరున పరీక్షించి.. ఆధారాలు సేకరించారు. ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అనంతరం ఇద్దరు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.