AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోటీసులు ఇవ్వకుండా.. సస్పెండ్ చేయడం పై ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం

ఆర్టీసీ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఎవరూ తగ్గడం లేదు. సమ్మె చేస్తున్న వారు ఉద్యోగులే కాదని ప్రభుత్వం అంటోంది. నాలుగో రోజు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె చేపట్టిన వారిని అరెస్టులు చేసినా.. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినా వారు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా తమను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చకుండా.. […]

నోటీసులు ఇవ్వకుండా.. సస్పెండ్ చేయడం పై ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 08, 2019 | 8:35 AM

Share

ఆర్టీసీ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఎవరూ తగ్గడం లేదు. సమ్మె చేస్తున్న వారు ఉద్యోగులే కాదని ప్రభుత్వం అంటోంది. నాలుగో రోజు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె చేపట్టిన వారిని అరెస్టులు చేసినా.. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినా వారు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా తమను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చకుండా.. ఉద్యోగం నుంచి తమను తొలగించడం కరెక్టు కదని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే దీనిపై రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ రూపొందించిన ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఇలా అయితే భవిష్యత్తులో ఆర్టీసీని ఎలా నడపాలనే దానిపై ప్రధానంగా చర్చించారు. ఆర్టీసీలో ప్రైవేటు బస్సులు వస్తాయంటూనే, మొత్తం ఆర్టీసీని మాత్రం ఎప్పటికీ ప్రైవేటీకరించబోమని సీఎం ప్రకటించారు.

ఆర్టీసీ సంస్థ ఎప్పటికీ ఉండి తీరాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపడుతున్నామనీ సీఎం కేసీఆర్ చెప్పారు. సునీల్ శర్మ ప్రతిపాదనలపై చర్చించిన తరువాత సీఎం పలు నిర్ణయాలు తీసుకున్నారు.

మొత్తానికి యూనియన్ల ప్రవర్తన వల్లే ఇలా చేస్తున్నామని ప్రభుత్వం అంటోంది. అయితే నోటీసులు కూడా ఇవ్వకుండా తమను ఎందుకు డిస్మిస్ చేశారని.. సస్పెండ్ అయిన కార్మికులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం యూనియన్ల ప్రవర్తన వల్లే ఇదంతా జరుగుతోందని చెబుతోంది. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ఇలా చేస్తున్నామని అంటోంది. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను చూసి ప్రజలు మెచ్చుకుంటున్నారని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.