AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Reddy: ఇంకా ఈడీ కార్యాలయానికి చేరుకోలేని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి

ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందుకు రానున్నారు. మంగళవారం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకానున్నారు..

Rohit Reddy: ఇంకా ఈడీ కార్యాలయానికి చేరుకోలేని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి
Rohit Reddy
Subhash Goud
|

Updated on: Dec 20, 2022 | 12:04 PM

Share

ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందుకు రానున్నారు. మంగళవారం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకానున్నారు. నిన్న రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు 6 గంటలపాటు విచారించారు. నిన్న తన వ్యక్తిగత వివరాలు, వ్యాపార లావాదేవీలపై అడిగారని చెప్పుకొచ్చారు రోహిత్‌రెడ్డి. దీంతో ఈడీ అధికారులు ఇవాళ ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకు ఈడీ ముందు రావాల్సి ఉండగా, ఇంకా హాజరు కాలేదు. నిన్న ఈడీ ముందుకు హాజరైన రోహిత్‌రెడ్డి.. ఇవాళ కూడా ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానని వెల్లడించారు.

తన ఆడిటర్ వద్ద నుంచి పూర్తి పత్రాలు తీసుకుంటున్నారు. తన పేరు మీద, తన భార్య పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు.. వాహనాలు, ఇతర స్థిర చరాస్తుల వివరాలను ఈడీకి అందించనున్నట్టు తెలుస్తోంది. భోజన విరామం తర్వాత ఈడి కార్యాలయానికి రోహిత్ రెడ్డి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయ్యప్ప దీక్షలో ఉన్నందున ఒకేసారి పూజ చేసి.. బిక్ష తీసుకున్న తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరుకానున్న రోహిత్ రెడ్డి.

ఇంకా ఈడీ కార్యాలయానికి చేరుకోలేని రోహిత్‌రెడ్డి

షెడ్యూల్‌ ప్రకారం 10:30కి ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ ఇంకా ఈడీ ఆఫీస్‌కు చేరుకోలేదు రోహిత్‌రెడ్డి. మణికొండ నుంచి ఉదయమే బయలుదేరిన రోహిత్‌రెడ్డి.. గంటన్నర క్రితమే గచ్చిబౌలిలోని ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి 10గంటలకు ఈడీ ఆఫీస్‌కు బయలుదేరాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి