Telangana: జనగామలో బరితెగించిన చైన్ స్నాచర్.. పసిబిడ్డ ప్రాణం తీశారు కదరా..!

|

Aug 01, 2022 | 4:54 PM

Telangana: జనగామ జిల్లాలో దారుణం జరిగింది. చైన్ స్నాచర్ల బరి తెగింపు అభంశుభం ఎరుగని పసిబాలిక ప్రాణాలు మింగేసింది. ఓ మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు..

Telangana: జనగామలో బరితెగించిన చైన్ స్నాచర్.. పసిబిడ్డ ప్రాణం తీశారు కదరా..!
Chain Snatchers
Follow us on

Telangana: జనగామ జిల్లాలో దారుణం జరిగింది. చైన్ స్నాచర్ల బరి తెగింపు అభంశుభం ఎరుగని పసిబాలిక ప్రాణాలు మింగేసింది. ఓ మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు అపహరించుకు పోయేందుకు ప్రయత్నించిన చైన్ స్నాచర్ ఆ మహిళ ప్రతిఘటించడంతో తన చేతిలోని పసిబిడ్డను నీళ్ళ సంపులో వేశాడు. దీంతో తొమ్మిది నెలల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో జరిగింది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబేద్కర్‌ నగర్‌ కాలనీలో నివసిస్తున్న బాస్కర్ – ప్రసన్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్న కూతురు తొమ్మిది నెలల బాలికతో ప్రసన్న తన ఇంటివద్ద ఒంటరిగా ఉంది. ఈ క్రమంలో ఓ దొంగ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ప్రసన్న ప్రతిఘటించడంతో ఆమె ఒళ్లోని పసిబాలికను తీసుకెళ్లి ఇంటి ముందున్న నీళ్ళ సంపులో పడేశాడు. అప్పటికే గేటు బయట మరోవ్యక్తి బైక్ పై కాపు కాసికొని ఉండడంతో పారిపోయాడు.

ప్రసన్న అరుపులు విని అక్కడికి చేరుకున్న స్థానికులు.. నీళ్ల సంపులో మునిగిన తొమ్మిది నెలల పసికందు తేజస్వి ని బయటకు తీశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా పసికందు ప్రాణాలు కోల్పోయింది. దీంతోబాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ దారుణ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు కోసం బాలికను నీళ్ల సంపులో వేసిన దొంగ.. ఆ పుస్తెలతాడు ఎందుకు వదిలి వెళ్లాడనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..