AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లైట్ నడిపి అదరహో అనిపించిన మంత్రి కేటీఆర్….

భారతదేశంలో పౌర విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్‌ ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. భాగస్వామ్యంతో కూడిన పెట్టుబడులు ఈ రంగాన్ని మంచి స్థితిలో ఉంచుతాయని చెప్పారు. ఎఫ్‌ఎస్‌టీసీ పైలట్‌ శిక్షణా...

ఫ్లైట్ నడిపి అదరహో అనిపించిన మంత్రి కేటీఆర్....
Jyothi Gadda
|

Updated on: Mar 13, 2020 | 12:30 PM

Share

భారతదేశంలో పౌర విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్‌ ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. భాగస్వామ్యంతో కూడిన పెట్టుబడులు ఈ రంగాన్ని మంచి స్థితిలో ఉంచుతాయని చెప్పారు. ఎఫ్‌ఎస్‌టీసీ పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని శంషాబాద్ లో మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…ఎఫ్‌ఎస్‌టీసీ తన శిక్షణా సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం హర్షనీయమని ప్రశంసించారు.

ఫ్లైట్‌ సిములేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ దేశంలోని విమానయాన శిక్షణా సంస్థల్లో ప్రధానమైంది. డీజీసీఏ, ఈఏఎస్‌ఏ చేత గుర్తింపు పొందిన సంస్థ ఎఫ్‌ఎస్‌టీసీ ఇప్పటికే ఎంతో మంది పైలెట్లకు శిక్షణ ఇచ్చింది. కాగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎఫ్‌ఎస్‌టీసీ శిక్షణా కేంద్రాలు దేశంలో గురుగ్రామ్‌, హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నాయి. దీని ద్వారా ఈ ప్రాంతవాసులకు శిక్షణా సౌకర్యాలు, పరిశ్రమ అభివృద్ధి, యువతకు అవకాశాలు పెరుగుతాయని కేటీఆర్ చెప్పారు. శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎస్‌టీసీ నిర్వాహకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.