Harish Rao: పక్క రాష్ట్రాలకు కరెంట్ ఇచ్చే స్థాయికి వచ్చాం.. హరీష్రావు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు మొదలయ్యాయి. రాష్ట్రం సాధించి పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఉత్సవాలను రాష్ట్రప్రభుత్వం 21 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ సాధించిన పురోగతి గురించి పలు కీలక విషయాలు పంచుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు మొదలయ్యాయి. రాష్ట్రం సాధించి పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఉత్సవాలను రాష్ట్రప్రభుత్వం 21 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ సాధించిన పురోగతి గురించి పలు కీలక విషయాలు పంచుకున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 25 వేల మెగావాట్లకు చేరుకుంటుందని తెలిపారు. సింగరేణి నుంచి 800 మెగావాట్లు, యాదాద్రి నుంచి 4 వేల మెగావాట్లు అలాగే ఎన్టీపీసీ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి రానుందని వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు చత్తీస్గఢ్ నుంచి కరెంట్ను కొనుక్కొని ప్రజలు, రైతులకు విద్యుత్ అందించామని.. మరికొన్ని రోజుల్లో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ విద్యుత్ అమ్మే స్థాయికి చేరనుందని వివరించారు.
ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వల్ల రాష్ట్రంలో 46 వేల చెరువుల పునరుద్ధరణ జరిగిందని పేర్కొన్నారు. ఒక్కప్పుడు వేసవిలో తాగడానికి కూడా నీళ్లు దొరకేవి కావని.. ఇప్పుడు మాత్రం చెరువులు నిండుగా ఉంటున్నాయని పేర్కొన్నారు. మహబూబ్నగర్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యాక వలసలు తగ్గిపోయాయని తెలిపారు. అలాగే నీటిపారుదల రంగంలో 119 శాతం వృద్ధిరేటు సాధించామని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తక్కువ కరెంట్ ఇస్తున్నారని తెలంగాణలో మాత్రం 24 గంటలు ఇస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 31 నియోజకవర్గాలకు నీళ్లు అందిస్తున్నామన్నారు.