Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆస్తి కోసం వరుస హత్యలు.. వారం వ్యవధిలో ఆరుగురిని చంపిన ప్రశాంత్.. పక్కా ప్లాన్‌తో ఒక్కొక్కరిని తీసుకెళ్లి..

ఆరు హత్యలతో నిజామాబాద్‌ ఉలిక్కిపడింది. ఒకే ఒక్కడు.. ఇంటి స్థలం కోసం ఏకంగా ఆరుగురిని హతమార్చాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఎవరికీ అనుమానం రాకుండా వరుస హత్యలతో కుటుంబాన్ని కడతేర్చాడు. ఆరుగురిని చంపేసింది 20ఏళ్ల ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు.

Telangana: ఆస్తి కోసం వరుస హత్యలు.. వారం వ్యవధిలో ఆరుగురిని చంపిన ప్రశాంత్.. పక్కా ప్లాన్‌తో ఒక్కొక్కరిని తీసుకెళ్లి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 18, 2023 | 4:48 PM

ఆరు హత్యలతో నిజామాబాద్‌ ఉలిక్కిపడింది. ఒకే ఒక్కడు.. ఇంటి స్థలం కోసం ఏకంగా ఆరుగురిని హతమార్చాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఎవరికీ అనుమానం రాకుండా వరుస హత్యలతో కుటుంబాన్ని కడతేర్చాడు. ఆరుగురిని చంపేసింది 20ఏళ్ల ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. మాక్లుర్‌కి చెందిన ప్రసాద్ కుటుంబం.. కొద్దిరోజుల క్రితం మాచారెడ్డికి షిఫ్ట్ అయింది. ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. స్నేహితుడు ప్రశాంత్.. ప్రసాద్‌ ఇంటిపై కన్నేశాడు. లోన్ అవసరం ఉందని చెప్పి అతని పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోవడంతో తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్‌పై ప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు. ఇది తట్టుకోలేక ప్రశాంత్‌ హత్యలకు ప్లాన్ చేశాడు.

మాట్లాడే పని ఉందంటూ ప్రసాద్‌ను బయటకు తీసుకెళ్లి.. కామారెడ్డి జాతీయ రహదారి సమీపంలో చంపేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికెళ్లాడు. ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని నమ్మించి ఆయన భార్యను బయటకు తీసుకెళ్లాడు. ఆమెను చంపేసి బాసర నదిలో మృతదేహం పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్‌ పెద్ద సోదరిని హతమార్చాడు. ఇద్దరు పిల్లల్ని సోన్ బ్రిడ్జి సమీపంలో .. చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో దారుణంగా చంపేశాడు.

మొదటి మూడు హత్యలు ప్రశాంత్‌.. మిగతా ముగ్గురి హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు ప్రశాంత్ క్రైమ్ బ్యాగ్రౌండ్‌పైనా ఆరాతీస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..