Telangana: ఈ నియోజకవర్గంలో పోలింగ్ సరళీపై‌ దృష్టి.. విజయంపై ఆ పార్టీ ధీమా..

| Edited By: Srikar T

May 14, 2024 | 3:06 PM

ఉత్కంఠ భరితంగా‌ సాగిన కరీంనగర్ ‌పార్లమెంటు‌ ఎన్నికల్లో అభ్యర్థులు పోలింగ్ సరళిపై దృష్టి ‌పెట్టారు. గత ఎన్నికల ‌లాగానే ఇప్పుడు కూడ 72 శాతం వరకు‌ పోలింగ్ నమోదు అయ్యింది. స్థిరంగా ఉన్న పోలింగ్ పైనా , గెలుపోటముల పైనా లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

Telangana: ఈ నియోజకవర్గంలో పోలింగ్ సరళీపై‌ దృష్టి.. విజయంపై ఆ పార్టీ ధీమా..
Brs Bjp Congress
Follow us on

ఉత్కంఠ భరితంగా‌ సాగిన కరీంనగర్ ‌పార్లమెంటు‌ ఎన్నికల్లో అభ్యర్థులు పోలింగ్ సరళిపై దృష్టి ‌పెట్టారు. గత ఎన్నికల ‌లాగానే ఇప్పుడు కూడ 72 శాతం వరకు‌ పోలింగ్ నమోదు అయ్యింది. స్థిరంగా ఉన్న పోలింగ్ పైనా , గెలుపోటముల పైనా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. పోలింగ్ సరళి తమ విజయానికి దోహదం చేస్తుందని‌ మూడు ప్రధాన పార్టీల‌ అభ్యర్థులు ధీమాని‌ వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు ‌పరిధిలో 72 ‌శాతం‌ పోలింగ్ ‌నమోదు అయ్యింది. గత ఎన్నికలలో‌ కుడా ఇంచుమించుగా ఇదే పోలింగ్ ‌శాతం నమోదు అయ్యింది. బిజేపి నుండి బండిసంజయ్, కాంగ్రెస్ నుండి వెలిచాల రాజేందర్ రావు, బిఅర్ఎస్ ‌నుండి వినోద్ కుమార్ బరిలో‌ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా గెలుపుపై ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఈసారి గ్రామీణ ఓటర్లతో పాటు పట్టణ ఓటర్లు అసక్తిగా తమ‌ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కౌంటింగ్‎కి‌ మరో‌ ఇరవై రోజుల సమయం ఉన్న నేఫథ్యంలో మరింత లోతుగా విశ్లేషణ చేపడుతున్నారు.

బీజేపీ అభ్యర్థి బండిసంజయ్ ‌కేంద్ర ప్రభుత్వం ‌పథకాలు, మోడి మానియా ,తాను చేసిన అభివృద్ధి విజయానికి దోహదపడుతాయని భావిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపి అనుకూలంగా ఓటు వేశారని అ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేబట్ఠిన‌ సంక్షేమ పథకాలు, అరు‌గ్యారంటీలు తమని ఆదరించాయని కాంగ్రెస్ ‌నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో ఓటింగ్ పెరగడంతో తమకే అనుకూలంగా ఉందని‌ ధీమాతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలు, నేతలతో మాట్లాడి ఇన్ పుట్ తెచ్చుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, తమకు అనుకూలంగా ఉందని బిఅర్ఎస్ ‌నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా రైతులు‌, కార్మికులు తమ పార్టీకే ఓటు వేశారని బిఅర్ఎస్ ‌నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మూడు పార్టీలు పోలింగ్, బూత్‎ల వారిగా నమోదు అయిన ఓట్లు, తమకి వచ్చిన‌ ఓట్లపై అరా తీస్తున్నారు. అసెంబ్లీల వారిగా నమోదు అయిన పోలింగ్ శాతం అనుకూల, ప్రతికూల అంశాలపై కుడా చర్చిస్తున్నారు. అంతే కాకుండా అయా పార్టీల అధిష్టానం కూడా కరీంనగర్ పార్లమెంటుపై దృష్టి సారించి పోలింగ్ సరళీని తెలుసుకోవడంలో నిమగ్నం అయ్యింది. ఎన్ని అంచనాలు వేసినప్పటికి జూన్ నాలుగున‌ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..