AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బీజేపీ ఎమ్మెల్యేలు 5మంది కాంగ్రెస్‎లోకి వస్తారు’.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సమీష్టి కృషితో తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్‎లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత లక్ష్మణ్ పై మండిపడ్డారు.

'బీజేపీ ఎమ్మెల్యేలు 5మంది కాంగ్రెస్‎లోకి వస్తారు'.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Jagga Reddy
Srikar T
|

Updated on: May 14, 2024 | 3:46 PM

Share

కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సమీష్టి కృషితో తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్‎లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత లక్ష్మణ్ పై మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీకి ఇబ్బంది లేకుండా తమ ప్రభుత్వం వ్యవహారించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికల్లో అధికారన్ని వాడుకొని ఇతర పార్టీలను ఇబ్బందికి గురిచేశాయన్నారు. లక్ష్మణ్ తమ పార్టీ నేతలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై పండితుడు లాగా జాతకాలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. అయన కామెంట్స్ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‎కు ఈ ఎన్నికల్లో కూడా క్లియర్ మెజారిటీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలను కూడా పార్టీ నెరవేరుస్తుందని చెప్పారు. తమ పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పండి ముందు అని బీజేపీని విమర్శించారు.

భారతదేశంలో యువతకు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. రూ.15 లక్షలు పేద వాడి అకౌంట్‎లో వేస్తా అన్నారు ఏమైందని నిలదీశారు. చెప్పింది చేయకుండా తప్పించుకునే దాంట్లో మీకు సాటి ఎవరూ రారన్నారు. ఏమైనా మాట్లాడితే దేవుడు పేరు చెబుతారని ఫైర్ అయ్యారు. మోసం అంటే తెలియని కుటుంబం గాంధీ కుటుంబం అని హామీలపై డిబేట్ కి వస్తారా అని సవాల్ విసిరారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎలాంటి డోకా లేకుండా నడుస్తుందన్నారు. కాంగ్రెస్‎లో బీఆర్ఎస్ విలీనం అంటున్నారు.. కేసీఆర్‎కి అంత అవసరం ఏమొచ్చిందని అడిగారు. లక్ష్మణ్ మాటలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు ఉన్నాయని చురకలు అంటించారు. బీజేపీ నుండి కూడా కాంగ్రెస్ పార్టీలోకి 5 మంది వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే బీఆర్ఎస్ నుండి 20మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని చెప్పారు. దీంతో తమ బలం 90కి పెరుగుతుందని తమ ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..