AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేవంత్ బ్రదర్స్ కబ్జా స్టోరీ.. చూస్తే షాక్ తినాల్సిందే..!

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అతని సోదరుడు చేసిన కబ్జాల స్టోరీ చూస్తే షాక్ తినాల్సిందే. ఈ సోదరుల కబ్జాలపై రెవెన్యూ అధికారులు చర్యలను రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాజేంద్రనగర్‌ RDO చంద్రకళ ఇచ్చిన రిపోర్ట్‌ను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు.

రేవంత్ బ్రదర్స్ కబ్జా స్టోరీ.. చూస్తే షాక్ తినాల్సిందే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 04, 2020 | 9:44 PM

Share

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అతని సోదరుడు చేసిన కబ్జాల స్టోరీ చూస్తే షాక్ తినాల్సిందే. ఈ సోదరుల కబ్జాలపై రెవెన్యూ అధికారులు చర్యలను రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాజేంద్రనగర్‌ RDO చంద్రకళ ఇచ్చిన రిపోర్ట్‌ను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగా ఇక రేవంత్ బ్రదర్స్‌పై చర్యలు తప్పవని తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డీ సోదరుల భూబాగోతంపై RDO రిపోర్టులను.. పక్కా సాక్ష్యాలతో పొందుపరిచారు. వందల కోట్ల రూపాయల విలువైన భూములను.. రేవంత్ బ్రదర్స్ ఆక్రమించినట్లు గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేటు, చెరువు భూములను సైతం వీరు వదల్లేదని నివేదికల్లో తేల్చారు. అంతేకాదు.. వీరు రికార్డులను కూడా తారుమారు చేసినట్లు RDO గుర్తించారు. 2005లో పహాణీలో ఇష్టారీతిన అప్పటి రెవెన్యూ అధికారులు మార్పులు చేశారు. A.రేవతి రెడ్డి W/o నర్సింహారెడ్డిగా పహాణీలో పేరును చేర్చారు. ఆ తర్వాత అనుముల రేవంత్‌రెడ్డి S/o నర్సింహారెడ్డిగా పేరును మార్పు చేశారు. ఇలా భూముల కబ్జా కోసం రేవంత్ బ్రదర్స్ అడ్డదారులను తొక్కారు. అంతేకాదు.. పహాణీలను సైతం పూర్తిగా మార్చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించే యోచనలో అధికారులు ఉన్నారు.

ఇక ఈ రిపోర్టులో గోపన్‌పల్లి సర్వే నెంబర్ 127లో భూలావాదేవీల వివరాలను పూర్తిగా జతచేశారు. కోమటికుంటలో FTL బఫర్ జోన్‌లోనూ ఎకరా 14 గుంటల్లో రేవంత్ రెడ్డి బ్రదర్స్‌ పాగా వేసినట్లు గుర్తించారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా చెరువు భూములను కబ్జా చేసినట్లు కూడా గుర్తించారు. అంతేకాదు కోమటి చెరువు శిఖం భూమిలోనే కాంపౌండ్ వాల్‌ను కట్టారు. సర్వే నెంబర్ 34లో కూడా.. ఒక ఎకరా 11 గుంటల భూమిని కబ్జా చేశారు. చెరువులోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేసినట్లు కూడా గుర్తించారు.

అంతేకాదు.. గోపనపల్లి రోడ్డును కూడా వీరు వదల్లేదు. సర్వే 127లో బండ్ల బాటను.. సర్వే నెం 128, 160ల్లో 10 గుంటల ప్రయివేట్ స్థలాన్ని కూడా కబ్జా చేశారు. ఇంకా వేరే వారితో కలిసి రేవంత్ పేరిట పహాణీలో 10 ఎకరాల 21 గుంటల భూమిని చేర్చారు. అయితే రికార్డుల్లో మాత్రం ఆ భూమి..13 ఎకరాల 11 గుంటలుగా నమోదు చేశారు. అప్పటి ఎమ్మార్వోలు రాజేశ్వర్‌రెడ్డి, సుబ్బారావు రికార్డులు తారుమారు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూములకు సంబంధఇంచి ఇప్పటికే 7 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి బ్రదర్స్‌ కబ్జా.. ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది.

Follow Us
ఖరీదైన క్రీములు లేకుండా నేచురల్ గ్లో.. శ్రద్ధాను చూసి నేర్చుకోండి
ఖరీదైన క్రీములు లేకుండా నేచురల్ గ్లో.. శ్రద్ధాను చూసి నేర్చుకోండి
మరో దేశంపై గురి పెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
మరో దేశంపై గురి పెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
ఇల్లు పిల్లలదే.. వచ్చి వెళ్లేది పేరెంట్స్ మాత్రమే! కొత్త ట్రెండ్
ఇల్లు పిల్లలదే.. వచ్చి వెళ్లేది పేరెంట్స్ మాత్రమే! కొత్త ట్రెండ్
జీర్ణ సమస్యలకు చెక్.. చర్మ వ్యాధులకు విరుగుడు! తాటి ముంజల పొట్టు
జీర్ణ సమస్యలకు చెక్.. చర్మ వ్యాధులకు విరుగుడు! తాటి ముంజల పొట్టు
భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. వీడియో
భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. వీడియో
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
ఖరీదైన ఫేషియల్స్ ఎందుకు? ‘తేనె’తో ఇంట్లోనే పార్లర్!
ఖరీదైన ఫేషియల్స్ ఎందుకు? ‘తేనె’తో ఇంట్లోనే పార్లర్!
వరుణ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్
వరుణ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్
ఈ ఫెంగ్ షుయ్ వస్తువులు ఇంట్లో ఉంటే.. అదృష్టం మీవెంటే!
ఈ ఫెంగ్ షుయ్ వస్తువులు ఇంట్లో ఉంటే.. అదృష్టం మీవెంటే!