AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: స్క్రీనింగ్ కమిటీలోకి కోమటిరెడ్డి, మధుయాష్కీ.. హస్తినలో కొనసాగుతోన్న వడబోత..!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరి కోన్ని రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు వేగవంతమైంది. అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ఇవాళ మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Telangana Congress: స్క్రీనింగ్ కమిటీలోకి కోమటిరెడ్డి, మధుయాష్కీ.. హస్తినలో కొనసాగుతోన్న వడబోత..!
Telangana Congress Leaders
Shaik Madar Saheb
|

Updated on: Sep 21, 2023 | 8:46 AM

Share

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరి కోన్ని రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు వేగవంతమైంది. అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ఇవాళ మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలోకి మరో ఇద్దరు సీనియర్ నేతలకు స్థానం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్‌లకు చోటు కల్పిస్తూ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ గా ఎంపీ మురళీధరన్ ఉన్నారు. సభ్యులుగా గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని, బాబా సిద్ధికి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధు యాష్కి లకు అందులో స్థానం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో అభ్యర్ధుల ఎంపిక కోసం మరింత స్క్రీనింగ్ జరగనున్నట్లు అర్ధమవుతోంది. అందరి నిర్ణయాలతోనే అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు 1016 మంది కాంగ్రెస్ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నుంచి 300 మంది అభ్యర్థులతో జాబితా తయారు చేసినట్టు తెలిసింది. వీటిలో 119 మందిని ఎంపిక చేయాల్సి ఉంది. స్క్రీనింగ్ కమిటీ ఆ జాబితా నుంచి అభ్యర్థులను వడపోసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఫైనల్ కాపీని ఇవ్వనుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేయనుంది.

అయితే, కోసం కష్టపడే అందరికీ ఏదో ఒక రకంగా న్యాయం జరిగేలా చూస్తామని, అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలకే పెద్దపీట వేస్తూ.. సామాజిక సమీకరణాలు కూడా జోడిస్తామని కాంగ్రెస్ అధిష్టానం నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ వడపోసిన అభ్యర్థులకు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తుది ఆమోదముద్ర వేయనుంది. అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలనే ప్రధానంగా పరిగణలోకి తీసుకోనున్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

ఇదిలాఉంటే.. త్వరలోనే బస్సు యాత్రను చేపట్టబోతున్నట్టు సీఎల్పీనేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అయితే, పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అందరికీ టిక్కెట్లు ఇవ్వలేమని మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ స్పష్టంచేశారు. టికెట్ రాని వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందనీ.. ప్రభుత్వం వచ్చాక తగిన పదవులు ఇచ్చి గౌరవిస్తామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..