AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మానాన్న ఇలా జరిగిందేంటి..? మొన్ననే కదా గుడ్ న్యూస్ చెప్పింది.. అంతలోనే

మృత్యువులోనూ భార్య భర్తల బంధం వీడలేదు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ భార్యాభర్తలను లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామంలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.

అమ్మానాన్న ఇలా జరిగిందేంటి..? మొన్ననే కదా గుడ్ న్యూస్ చెప్పింది.. అంతలోనే
Khammam Crime News
N Narayana Rao
| Edited By: |

Updated on: Jan 08, 2026 | 10:54 AM

Share

మృత్యువులోనూ భార్య భర్తల బంధం వీడలేదు. ఎన్నో ఆశలు ఆకాంక్షలతో జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ భార్యాభర్తలను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. భర్త చిరు వ్యాపారం చేస్తున్నాడు.. భార్య ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.. ఎంతో ఆనందంతో పిల్లలను చూసుకుంటూ.. కలలు కంటున్న ఆ కుటుంబంలో విషాద ఘటన చోటుచేసుకోవడం పలువురిని కంటతడి పెట్టించింది.. తల్లిదండ్రుల దుర్మరణంతో చిన్నారులు అనాధలుగా మారారు.

ఈ ఘటన ఖమ్మం వైరా మండలంలోని సోమవరం గ్రామ సమీపంలో అర్ధరాత్రి జరిగింది.. లారీ , ట్రాలీ ఢీకొన్న ఘటనలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న వడ్డాది రాము, వెంకటరత్నం దంపతులు దుర్మరణం చెందారు. వడ్డాది రాము గ్రామాల్లో తిరుగుతూ పరుపులు అమ్ముతూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి వెంకటరత్నం ఇటీవలనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగం సాధించింది. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో విధులు నిర్వహిస్తోంది.

ఎప్పటిలాగానే భర్త రాము వ్యాపారం ముగించుకొని సతీమణి వెంకట రత్నాన్ని తన ట్రాలీ ఆటో క్యాబిన్లో కూర్చోబెట్టుకొని జగ్గయ్యపేట నుంచి వైరాకు బయలుదేరాడు. వైరా మండలం సోమవరం గ్రామ సమీపంలో.. వైరా నుంచి బోనకల్ వైపు వెళ్తున్న లారీ వేగంగా దూసుకు వచ్చి ట్రాలీ ఆటోను ఢీ కొట్టింది. భార్య వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందింది. భర్త రాముకు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం తెలుసుకున్న వైరా ఎస్సై పుష్పాల రామారావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్ లో గాయాల పాలైన రామును ఆస్పత్రికి తరలించారు. రామారావు చికిత్స పొందుతూ ఆయన కూడా మృతి చెందాడు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు మరణంతో పిల్లలు అనాధలుగా మారారు. అమ్మ నాన్న మాకు దిక్కు ఎవరు..మమ్మల్ని వదిలి ఎక్కడకు వెళ్ళారంటూ చిన్నారుల రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. భార్యాభర్తల దుర్మరణంతో వైరాలోని టీచర్స్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమ్మబాబోయ్‌ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
అమ్మబాబోయ్‌ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్‌
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్‌
ఆ అంకుల్ నాతో అలా ప్రవర్తించేవారు.. తర్వాతే అర్థమైంది.. సీరియల్ న
ఆ అంకుల్ నాతో అలా ప్రవర్తించేవారు.. తర్వాతే అర్థమైంది.. సీరియల్ న
నాకు మరో భార్య కావాలి.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి వ్యక్తి హంగామా
నాకు మరో భార్య కావాలి.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి వ్యక్తి హంగామా
తెల్లవారుజామున పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికులు
తెల్లవారుజామున పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికులు
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్..
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్..
సరికొత్తగా టీమిండియా.. జట్టులోకి 31 ఏళ్ల స్టార్ ఎంట్రీ.. ఇక రచ్చే
సరికొత్తగా టీమిండియా.. జట్టులోకి 31 ఏళ్ల స్టార్ ఎంట్రీ.. ఇక రచ్చే
సంక్రాంతి ఎఫెక్ట్.. నాటుకోళ్ల ధరలకు రెక్కలు.. కేజీ ఎంతో తెలిస్తే.
సంక్రాంతి ఎఫెక్ట్.. నాటుకోళ్ల ధరలకు రెక్కలు.. కేజీ ఎంతో తెలిస్తే.
మీ జాతకంలో శుక్ర దోషం ఉందా? శుక్రవారం ఈ పరిహారాలు చేస్తే అదృష్టం
మీ జాతకంలో శుక్ర దోషం ఉందా? శుక్రవారం ఈ పరిహారాలు చేస్తే అదృష్టం
టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ చేయనున్న ముగ్గురు స్టార్స్..?
టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ చేయనున్న ముగ్గురు స్టార్స్..?