AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR : ఎన్టీఆర్ లో నచ్చిందదే.. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతోంది : కేసీఆర్

తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని.. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం పంజాబ్‌ను అధిగమించామని సీఎం కేసీఆర్ అన్నారు. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి,..

KCR : ఎన్టీఆర్ లో నచ్చిందదే.. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతోంది : కేసీఆర్
Cm KCR
Venkata Narayana
|

Updated on: Jun 20, 2021 | 11:17 PM

Share

CM KCR on NTR : తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని.. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం పంజాబ్‌ను అధిగమించామని సీఎం కేసీఆర్ అన్నారు. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే ఇదంతా సాధ్యమైందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని, అది తనకెంతో నచ్చిన పథకమని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆ పథకం వల్లే ఎంతోమంది ఆకలి తీరిందని చెప్పారు. ఆ తర్వాత ఎన్నో మార్పులు జరిగి, ఇప్పుడు మనం రూపాయికే కిలో బియ్యం ఇచ్చుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు.

ఆదివారం సిద్ధిపేటలో కలెక్టరేట్, కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ప్రారంభించిన కేసీఆర్.. తాను పుట్టిన జిల్లా సిద్ధిపేటేనని, తెలంగాణ రాకముందే మిషన్‌ కాకతీయ రూపకల్పన చేశామని చెప్పారు. సిద్దిపేట, నల్లగొండ, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో ధరణి తయారు చేసేందుకు మూడేళ్లు పట్టిందని కేసీఆర్ అన్నారు. రెవెన్యూలో గందరగోళం ఎందుకని నేనే మీటింగ్ పెట్టి ధరణి రూపొందించామని చెప్పుకొచ్చారు. ధరణి వల్ల ఇప్పుడు మూడు రకాలుగా మాత్రమే భూమి వేరే వాళ్ల పేరు మీదకు మారుతుందని అన్నారు. అమ్మడం లేదా కొనడం, వారసత్వం, గిఫ్టులాగా భూమి ఇవ్వడం వల్ల మాత్రమే భూమి మరొకరి పేరు మీదకి మారుతుందని కేసీఆర్ అన్నారు.

”రైతు బంధుపై ప్రభుత్వం పెట్టే ఖర్చు రూ.15 వేల కోట్లు అని చెప్పిన సీఎం , 95 శాతం మంది ఈ సాయం ఉపయోగపడుతోందని, ఎక్కడో ఒకరు మందు తాగడానికి ఈ డబ్బును వాడుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు ఐదెకరాల లోపు వారే ఉన్నారని, రాష్ట్రంలో మొత్తం భూములు 2.5 కోట్ల ఎకరాలు ఉండగా.. రైతుల వద్దే కోటిన్నర ఎకరాలు ఉన్నాయని అన్నారు. రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వం మాదని, అవినీతిని అరికట్టేందుకు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.

Read also :  Vijayashanthi : నామమాత్రపు లాక్ డౌన్లతో మమ అనిపించి.. చివరికి పాజిటివ్ రేటు తగ్గిపోయిందంటూ ఎత్తేశారు : విజయశాంతి

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!