KCR : ఎన్టీఆర్ లో నచ్చిందదే.. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతోంది : కేసీఆర్

తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని.. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం పంజాబ్‌ను అధిగమించామని సీఎం కేసీఆర్ అన్నారు. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి,..

KCR : ఎన్టీఆర్ లో నచ్చిందదే.. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతోంది : కేసీఆర్
Cm KCR
Follow us

|

Updated on: Jun 20, 2021 | 11:17 PM

CM KCR on NTR : తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని.. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం పంజాబ్‌ను అధిగమించామని సీఎం కేసీఆర్ అన్నారు. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే ఇదంతా సాధ్యమైందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని, అది తనకెంతో నచ్చిన పథకమని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆ పథకం వల్లే ఎంతోమంది ఆకలి తీరిందని చెప్పారు. ఆ తర్వాత ఎన్నో మార్పులు జరిగి, ఇప్పుడు మనం రూపాయికే కిలో బియ్యం ఇచ్చుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు.

ఆదివారం సిద్ధిపేటలో కలెక్టరేట్, కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ప్రారంభించిన కేసీఆర్.. తాను పుట్టిన జిల్లా సిద్ధిపేటేనని, తెలంగాణ రాకముందే మిషన్‌ కాకతీయ రూపకల్పన చేశామని చెప్పారు. సిద్దిపేట, నల్లగొండ, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో ధరణి తయారు చేసేందుకు మూడేళ్లు పట్టిందని కేసీఆర్ అన్నారు. రెవెన్యూలో గందరగోళం ఎందుకని నేనే మీటింగ్ పెట్టి ధరణి రూపొందించామని చెప్పుకొచ్చారు. ధరణి వల్ల ఇప్పుడు మూడు రకాలుగా మాత్రమే భూమి వేరే వాళ్ల పేరు మీదకు మారుతుందని అన్నారు. అమ్మడం లేదా కొనడం, వారసత్వం, గిఫ్టులాగా భూమి ఇవ్వడం వల్ల మాత్రమే భూమి మరొకరి పేరు మీదకి మారుతుందని కేసీఆర్ అన్నారు.

”రైతు బంధుపై ప్రభుత్వం పెట్టే ఖర్చు రూ.15 వేల కోట్లు అని చెప్పిన సీఎం , 95 శాతం మంది ఈ సాయం ఉపయోగపడుతోందని, ఎక్కడో ఒకరు మందు తాగడానికి ఈ డబ్బును వాడుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు ఐదెకరాల లోపు వారే ఉన్నారని, రాష్ట్రంలో మొత్తం భూములు 2.5 కోట్ల ఎకరాలు ఉండగా.. రైతుల వద్దే కోటిన్నర ఎకరాలు ఉన్నాయని అన్నారు. రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వం మాదని, అవినీతిని అరికట్టేందుకు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.

Read also :  Vijayashanthi : నామమాత్రపు లాక్ డౌన్లతో మమ అనిపించి.. చివరికి పాజిటివ్ రేటు తగ్గిపోయిందంటూ ఎత్తేశారు : విజయశాంతి

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!