AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. కూకట్‌ పల్లి బరిలో ఎవరంటే?

త్వరలోనే జరిగే తెలంగాణ అసెంబ్లీ పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను జనసేన పార్టీ ప్రకటించింది. బీజేపీ పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ విషయానికొస్తే.. కూకట్ పల్లి పరిధిలో ప్రేమ్ కుమార్ బరిలోకి దిగనున్నారు.

Telangana Elections: తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. కూకట్‌ పల్లి బరిలో ఎవరంటే?
Janasena Chief Pawan Kalyan
Basha Shek
|

Updated on: Nov 07, 2023 | 10:17 PM

Share

త్వరలోనే జరిగే తెలంగాణ అసెంబ్లీ పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను జనసేన పార్టీ ప్రకటించింది. బీజేపీ పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ విషయానికొస్తే.. కూకట్ పల్లి పరిధిలో ప్రేమ్ కుమార్ బరిలోకి దిగనున్నారు.

జనసేన అభ్యర్థుల జాబితా

  • కూకట్‌పల్లి-ప్రేమ్‌కుమార్‌
  • తాండూరు-శంకర్‌గౌడ్‌
  • కోదాడ-మేకల సతీష్‌రెడ్డి
  • ఖమ్మం-మిర్యాల రామకృష్ణ
  • నాగర్‌కర్నూలు-వంగ లక్ష్మణ్‌గౌడ్‌,
  • వైరా-సంపత్‌నాయక్
  • కొత్తగూడెం-లక్కినేని సురేందర్‌రావు
  • అశ్వారావుపేట-ముయబోయిన ఉమాదేవి

తాండూరు నుంచి శంకర్ గౌడ్..

కాగా బీజేపీ- జనసేన పార్టీల  పోత్తు కుదిరిన తరువాత ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. సభ ఆరంభంలోనే ముఖ్య నాయకులతో పాటు పవన్ కల్యాణ్ ముందు గానే సభ స్థలికి చేరుకున్నారు. కాగా పవన్‌ కల్యాణ్ లాంటి స్టార్‌ హీరో ప్రచారానికి వస్తే కచ్చితంగా తమకు మేలు జరుగుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే ప్రచారానికి పవన్‌ను ఉపయోగించుకోవాలని తెలంగాణ బీజేపీ అభ్యర్థులు భావిస్తున్నారు. చూడాలి మరి పవన్‌ ప్రచారంలో పాల్గొంటారో లేదో చూడాలి.

బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోడీతో పవన్ కల్యాణ్

తెలంగాణ అభివృద్ధి ఆకాంక్ష నెరవేరాలి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..