Manuguru Municipality: కమిషనర్‌ కుర్చీ కోసం పొట్టు పొట్టుగా కొట్టుకున్న అధికారులు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కలెక్టర్..

Manuguru Municipality: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీలో హైడ్రామా చోటు చేసుకుంది. కమిషనర్‌ కుర్చీ కోసం ఇద్దరు అధికారులు కొట్టుకున్నారు.

Manuguru Municipality: కమిషనర్‌ కుర్చీ కోసం పొట్టు పొట్టుగా కొట్టుకున్న అధికారులు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కలెక్టర్..
Follow us

|

Updated on: Feb 15, 2022 | 12:22 PM

Manuguru Municipality: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీలో హైడ్రామా చోటు చేసుకుంది. కమిషనర్‌ కుర్చీ కోసం ఇద్దరు అధికారులు కొట్టుకున్నారు. ఒకే రోజులో ఉన్నతాధికారులు రెండు ఆర్డర్లు ఇవ్వడంతో కమిషనర్ నేనంటే నేనంటూ గొడవ పడ్డారు. ప్రస్తుత కమిషనర్ నాగప్రసాద్‌, బదిలీపై వచ్చిన వెంకటస్వామి పరస్పరం అటాక్ చేసుకున్నారు. ఒకవైపు నాగప్రసాద్‌, వెంకటస్వామి మధ్య రగడ జరుగుతుండగానే మరో ట్విస్ట్‌ ఇచ్చారు ఉన్నతాధికారులు. ఇన్‌ఛార్జ్‌ కమిషనర్‌గా మాధవిని నియమిస్తూ మరో ఆర్డర్‌ ఇచ్చారు.

వైరా నుంచి బదిలీపై వచ్చిన వెంకటస్వామికి ఛార్జ్‌ ఇచ్చేందుకు నిరాకరించారు ప్రస్తుత కమిషనర్‌ నాగప్రపాద్‌. కలెక్టర్‌ ఆదేశాలు ఇవ్వకుండా రిలీవ్ కాలేనంటూ గొడవకు దిగారు. తనను సంప్రదించకుండా కమిషనర్ కుర్చీలో ఎలా కూర్చుంటావంటూ వెంకటస్వామితో ఫైటింగ్‌ మొదలుపెట్టారు. ఇంతలోనే వెంకటస్వామి బదిలీ ఆర్డర్స్‌పై బ్రేకేసి మరో ట్విస్ట్‌ ఇచ్చారు ఉన్నతాధికారులు. వీళ్లిద్దరి మధ్య గొడవ ఇలా జరుగుతుండగానే, సీనియర్‌ అసిస్టెంట్‌ మాధవిని ఇన్‌ఛార్జ్‌ కమిషనర్‌గా నియమిస్తూ ఆర్డర్‌ ఇచ్చారు కలెక్టర్‌.

Also read:

Liquor Shops Offer: ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం.. మద్యం షాపుల బంపర్ ఆఫర్..!

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఆఫ్‌ లైన్‌లో సర్వ దర్శనం టికెట్స్‌ జారీ..

Hyderabad: రాత్రి బయటకు వెళ్లిన యువతి.. తెల్లారి మామిడితోటలో శవమై తేలింది.. ఇంతకీ ఏం జరిగిందంటే..