AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయుష్మాన్‌భవ కంటే ఆరోగ్యశ్రీ బెటర్: కేటీఆర్

నడ్డా…ఇది తెలంగాణ బిడ్డల గడ్డ..అమాయకులెవరూ లేరిక్కడ. అందరం ఆరితేరినవారమే. మీ కర్ణాటక ఎత్తుగడలు ఇక్కడ చెల్లవు’. అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఆయన జేపీ నడ్డా కాదు. అబద్దాల అడ్డా అని తీవ్రంగా విమర్శించారు. సోమవారం జరిగిన కూకట్‌పల్లి నియోజకవర్గం బూత్‌స్థాయి, డివిజన్‌, అనుబంధ కమిటీల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల పైచిలుకు సభ్యత్వాన్ని పూర్తిచేసుకొని తెరాస తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని అన్నారు. ఆదివారం భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు […]

ఆయుష్మాన్‌భవ కంటే ఆరోగ్యశ్రీ బెటర్: కేటీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 20, 2019 | 6:43 AM

Share

నడ్డా…ఇది తెలంగాణ బిడ్డల గడ్డ..అమాయకులెవరూ లేరిక్కడ. అందరం ఆరితేరినవారమే. మీ కర్ణాటక ఎత్తుగడలు ఇక్కడ చెల్లవు’. అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఆయన జేపీ నడ్డా కాదు. అబద్దాల అడ్డా అని తీవ్రంగా విమర్శించారు. సోమవారం జరిగిన కూకట్‌పల్లి నియోజకవర్గం బూత్‌స్థాయి, డివిజన్‌, అనుబంధ కమిటీల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల పైచిలుకు సభ్యత్వాన్ని పూర్తిచేసుకొని తెరాస తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని అన్నారు. ఆదివారం భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెరాసపై, కేసీఆర్‌పై చేసిన ఆరోపణలపై కేటీఆర్‌ ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. ఆయుష్మాన్‌ భారత్‌కంటే ఆరోగ్యశ్రీ చాలా మెరుగైన పథకమని మా సీఎం కేంద్రం ముఖం మీదే చెప్పారు. ఇందులో చిన్నచిన్న సమస్యలుంటే పరిష్కరించుకుంటాం తప్ప మీ సహకారం, సాయం మాకు అవసరం లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాది రెండు నాల్కల ధోరణి అని, గతంలో ఆరోగ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న ఆయన ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, భాస్కర్‌రావు, గొంగిడి సునీత, భూపాల్‌రెడ్డిలు సోమవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో భాజపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్నె ప్రభాకర్‌ మాట్లాడుతూ, నడ్డా కేంద్ర వైద్య శాఖ మంత్రిగా ఆరోగ్యశ్రీని మెచ్చుకున్నారని, ఆయనతోపాటు కేంద్ర మంత్రులు, అధికారులు తెరాస ప్రభుత్వాన్ని పొగిడారన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చి అబద్దపు ఆరోపణలు చేశారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే వాటిని ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ నేతలకు చేతనైతే తెలంగాణకు విభజన చట్టం హామీలు అమలు పరచాలని అన్నారు.

ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
చైనా కబ్జాలో ఉన్న షక్స్‌గామ్‌ భూభాగం భారత్‌దే: ఆర్మీ చీఫ్‌
చైనా కబ్జాలో ఉన్న షక్స్‌గామ్‌ భూభాగం భారత్‌దే: ఆర్మీ చీఫ్‌
వీరికి ఆ బాధలు ఉండవ్..శని దేవుడే ఈ రాశులకు కొండంత అండ!
వీరికి ఆ బాధలు ఉండవ్..శని దేవుడే ఈ రాశులకు కొండంత అండ!
మీ ఫోన్‌లో తరచు నోటిఫికేషన్‌లతో చిరాకు పడుతున్నారా? ఈ ఫీచర్‌తో..
మీ ఫోన్‌లో తరచు నోటిఫికేషన్‌లతో చిరాకు పడుతున్నారా? ఈ ఫీచర్‌తో..
బాబోయ్‌..గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం..! అసలు ఏంటో తెలిస్తే..
బాబోయ్‌..గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం..! అసలు ఏంటో తెలిస్తే..
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు