Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే కుమారుడు మృతి

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజుల క్రితం నుంచి అనారోగ్యంతో..

Hyderabad: గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే కుమారుడు మృతి
Vishnuvardhan Reddy
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 27, 2023 | 12:01 PM

పటాన్‌చెరు, జులై 27: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజుల క్రితం నుంచి అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన మృతి చెందారు.

విష్ణువర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఆయనకు కామెర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్‌కు వైద్యులు డయాలసిస్‌ చేశారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున 2 గంటలకు గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు విష్ణువర్ధన్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నివాసానికి తరలించారు. కుమారుడి మృతితో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.