AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు..

రైళ్ల రద్దును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. పలు ప్యాసింజర్ రైళ్లను రద్దును పొడిగించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తీసుకున్న..

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు..
South Central Railway
Sanjay Kasula
|

Updated on: Jan 24, 2022 | 7:12 PM

Share

South Central Railway: రైళ్ల రద్దును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. పలు ప్యాసింజర్ రైళ్లను రద్దును పొడిగించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పొడిగించింది. గతంలో తీసుకున్న నిర్ణయం ఇవాళ్టితో ముగియనుంది. దీంతో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నందున జనవరి 31 వరకుపొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది దక్షిణ మధ్య రైల్వే.

ఈ రైళ్లలో సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, కర్నూలు, కలబుర్గి , చెన్నై వంటి ప్రధాన స్టేషన్ల నుండి అనేక రైళ్లు ఉన్నాయి. ఇందులో చిత్తూరు- సికింద్రాబాద్, సికింద్రాబాద్- చిత్తూరు, కాజిపేట్-సికింద్రాబాద్, హైదరాబాద్ కాజిపేట్. ఇలా మొత్తం 55 సర్వీసులను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.

శుక్రవారం, దక్షిణ మధ్య రైల్వే (SCR) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని గమ్యస్థానాలను కవర్ చేసే 55 రైళ్లను రద్దు చేసింది. వాస్తవానికి జనవరి 24, సోమవారం వరకు రద్దు చేయబడిన ప్యాసింజర్ రైలు సేవలు ఇప్పుడు సోమవారం, జనవరి 31 వరకు రద్దు చేసింది.

SCR సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్  ఆరు విభాగాలను కలిగి ఉంది . ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు , కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు సేవలు అందిస్తుంది.

ఇవి కూడా చదవండి: Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Medicinal Plants: ఔషద మొక్కల పెంపకంతో అద్భుతాలు.. ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా..