AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు కింద పడిన ప్రయాణికుడు.. ఆ కానిస్టేబుల్ ఏం చేశాడంటే..

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కానిస్టేబుల్ వికుల్ కుమార్ సాయంతో ఓ ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డాడు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ నుంచి కిందికి దిగేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు జారి వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ఫ్లాట్ ఫామ్‌కి, రైలుకి మధ్య ఇరుక్కుపోయాడు. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ వికుల్‌కుమార్‌.. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి ప్రయాణికుడిని చెయ్యి పట్టుకుని లాగాడు. అది గమనించిన తోటి ప్రయాణికులు అరుపులు కేకలు వేశారు కాని ఎవరు అతడిని రక్షించడానికి ప్రయత్నించలేదు. వెంకట్ రెడ్డిని […]

రైలు కింద పడిన ప్రయాణికుడు.. ఆ కానిస్టేబుల్ ఏం చేశాడంటే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 30, 2019 | 11:32 AM

Share

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కానిస్టేబుల్ వికుల్ కుమార్ సాయంతో ఓ ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డాడు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ నుంచి కిందికి దిగేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు జారి వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ఫ్లాట్ ఫామ్‌కి, రైలుకి మధ్య ఇరుక్కుపోయాడు. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ వికుల్‌కుమార్‌.. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి ప్రయాణికుడిని చెయ్యి పట్టుకుని లాగాడు. అది గమనించిన తోటి ప్రయాణికులు అరుపులు కేకలు వేశారు కాని ఎవరు అతడిని రక్షించడానికి ప్రయత్నించలేదు. వెంకట్ రెడ్డిని కాపాడిని వికుల్ కుమర్‌ను తోటి కానిస్టేబుళ్లు, ఆర్పీఎఫ్ ఐజీ ఈశ్వర్, కమిషనర్ రామకృష్ణ అభినందించారు. ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో బయటపడిన వెంకట్‌రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.