ఏపీ పరిణామాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యంగా రాజధాని వివాదంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రం కుప్పకూలే పరిస్థితుల్లో ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీలో పరిస్థితుల వల్ల తెలంగాణకు లాభం చేకూరుతుందని.. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పెరిగిందని ఆయన తెలిపారు. నిన్నటివరకు సోదరులుగా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ముసలం పుట్టడం బాధగా ఉందని చెప్పుకొచ్చారు. ఏపీ రాజధాని పరిణామాలపై తెలంగాణ వ్యక్తిగా సంతోషంగా ఉన్నా.. భారతీయ పౌరుడిగా […]

ఏపీ పరిణామాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Jan 12, 2020 | 8:56 PM

ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యంగా రాజధాని వివాదంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రం కుప్పకూలే పరిస్థితుల్లో ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీలో పరిస్థితుల వల్ల తెలంగాణకు లాభం చేకూరుతుందని.. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పెరిగిందని ఆయన తెలిపారు. నిన్నటివరకు సోదరులుగా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ముసలం పుట్టడం బాధగా ఉందని చెప్పుకొచ్చారు. ఏపీ రాజధాని పరిణామాలపై తెలంగాణ వ్యక్తిగా సంతోషంగా ఉన్నా.. భారతీయ పౌరుడిగా బాధపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఓ స్థిరాస్తి వ్యాపారికి మేలు చేసేందుకే ఏపీలో గందరగోళం సృష్టించారని అన్నారు.