Telangana: మల్కాజ్‎గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో.. ఈ ప్రాంతాల్లో హై అలర్ట్..

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 400కు పైగా సీట్లు రావాలనే లక్ష్యంతో బిజెపి హై కమాండ్ ముందుకు దూసుకెళ్తూ ఉంటే ఎలాగైనా కేంద్రంలో స్థానం దక్కించుకోవాలి అని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు దఫాలు ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు పర్యటించారు. తాజాగా మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో మోడీ పర్యటించనున్నారు.

Telangana: మల్కాజ్‎గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో.. ఈ ప్రాంతాల్లో హై అలర్ట్..
Pm Modi

Edited By:

Updated on: Mar 15, 2024 | 9:27 AM

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 400కు పైగా సీట్లు రావాలనే లక్ష్యంతో బిజెపి హై కమాండ్ ముందుకు దూసుకెళ్తూ ఉంటే ఎలాగైనా కేంద్రంలో స్థానం దక్కించుకోవాలి అని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు దఫాలు ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు పర్యటించారు. తాజాగా మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో మోడీ పర్యటించనున్నారు. మార్చి 15న ఉదయం హైదరాబాద్‎కి రానున్న మోదీ.. మల్కాజ్‎గిరిలో నిర్వహించే విజయ సంకల్ప సభకు సంబంధించిన రోడ్ షోలో పాల్గొననున్నారు. దీంతో బేగంపేట నుండి మల్కాజ్‎గిరి రూట్ మొత్తం భారీ బధ్రత ఏర్పాటు చేశారు. ఈ మార్గాన్ని పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ సిపి తరుణ్ జోషి వెల్లడించారు.

ప్రధాని మోదీ విజయ సంకల్ప రోడ్ షో లో భాగంగా మల్కాజ్‎గిరి‎లో హై అలర్డ్ కొనసాగుతోంది. మల్కాజ్‎గిరిలో 1.3 కిలోమీటర్ల ఈ రోడ్ షో జరగనుంది. దీంతో కేంద్ర రాష్ట్ర బలగాలు రంగంలోకి దిగాయి. ప్రధానంగా ఈ రోడ్డు మార్గాన్ని ఎస్పీజీ బృందం తమ ఆధీనంలోకి తీసుకుంది. కేరళ నుండి 4.50 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి రానున్న మోదీ.. రోడ్డు మార్గం ద్వారా మీర్జాలగూడ చౌరస్తాకు చేరుకుంటారు. 5.15 నిమిషాలు నుండి మొదలుకొని 6.15 నిమిషాల వరకు ఈ రోడ్ షోలో పాల్గొన్న ఉన్నారు. దీంతో ఈ మార్గంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా భారీకేట్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇరువైపులా ఉన్న షాపులను సైతం మూయించేశారు. ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్ చేసిన ఎస్పీజీ బృందం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర పోలీసులు సహా భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ రోడ్డు మార్గంలో వెళ్లేటటువంటి వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాల్సిందిగా ఇప్పటికే సూచనలను జారీ చేశారు పోలీసు అధికారులు. దీంతో మోడీ ప్రయాణించే మార్గాలన్నీ హై అలెర్ట్‎గా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..