AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయారెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి సబితా పరామర్శ..

సురేష్‌ అనే వ్యక్తి చేతిలో ప్రాణాలు కోల్పోయిన అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. రామకృష్ణాపురం డివిజన్‌ వాసవి కాలనీలో గల తహసీల్దార్‌ నివాసానికి వెళ్లిన మంత్రి సబితా..విజయారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. భర్త, పిల్లలతో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన రోజే తహసీల్దార్‌ కార్యాలయంతో పాటు ఉస్మానియా ఆస్పత్రిలో విజయరెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. కాగా తెలుగు […]

విజయారెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి సబితా పరామర్శ..
Anil kumar poka
|

Updated on: Nov 09, 2019 | 6:24 PM

Share
సురేష్‌ అనే వ్యక్తి చేతిలో ప్రాణాలు కోల్పోయిన అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. రామకృష్ణాపురం డివిజన్‌ వాసవి కాలనీలో గల తహసీల్దార్‌ నివాసానికి వెళ్లిన మంత్రి సబితా..విజయారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. భర్త, పిల్లలతో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన రోజే తహసీల్దార్‌ కార్యాలయంతో పాటు ఉస్మానియా ఆస్పత్రిలో విజయరెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. కాగా తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారిన విజయారెడ్డి దారుణ హత్య వెనుక గల నిజా నిజాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.