AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దేశంలోనే అతిపెద్ద మాల్‌ మన హైదరాబాద్‌లో.. 26వ తేదీన ప్రారంభం..

లులూ మాల్స్‌ ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన అన్ని మాల్స్‌తో పోల్చితే కూకట్‌పల్లిలో ఏర్పాటు చేస్తున్నది పెద్దదని తెలుస్తోంది. కూకట్‌పల్లిలో ఉన్న మంజీరా మాల్‌ను రీమోడలింగ్ చేసి లులు మాల్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఇందుకోసం లులూ గ్రూప్‌ సుమారు రూ. 300 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 5 లక్షల చదరపు మీట్ల విస్తీరణంలో ఈ మాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మాల్‌ ద్వారా ఏకంగా...

Hyderabad: దేశంలోనే అతిపెద్ద మాల్‌ మన హైదరాబాద్‌లో.. 26వ తేదీన ప్రారంభం..
Lulu Mall Hyderabad
Narender Vaitla
|

Updated on: Sep 24, 2023 | 7:12 AM

Share

హైదరాబాద్‌ మహా నగరం మరో అద్భుతానికి వేదికకానుంది. దేశంలోనే అతిపెద్ద షామింగ్‌ మాల్‌ హైదరాబాద్‌లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. యూఏఈకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత లులూ గ్రూప్‌ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన మెగా షాపింగ్‌ మాల్‌ను ఈ నెల 26వ తేదీన ప్రారంభించనున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఈ మాల్‌ను ప్రారంభించనున్నారు.

లులూ మాల్స్‌ ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన అన్ని మాల్స్‌తో పోల్చితే కూకట్‌పల్లిలో ఏర్పాటు చేస్తున్నది పెద్దదని తెలుస్తోంది. కూకట్‌పల్లిలో ఉన్న మంజీరా మాల్‌ను రీమోడలింగ్ చేసి లులు మాల్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఇందుకోసం లులూ గ్రూప్‌ సుమారు రూ. 300 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 5 లక్షల చదరపు మీట్ల విస్తీరణంలో ఈ మాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మాల్‌ ద్వారా ఏకంగా 2 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో 200కిపైగా దుకాణాలు ఉంటాయి. అంతేకాకుండా 5 సినిమా స్క్రీన్స్‌ ఏర్పాటు చేశారు.

ఒక్కో స్క్రీన్‌ కెపాసిటీ ఏకంగా 1400 సీట్లు కావడం విశేషం. ఒకేసారి 3వేల కార్లను పార్కింగ్ చేసేందుకు వీలుగా ఈ మాల్‌ను నిర్మించారు. అలాగే మాల్‌లో ఫుడ్‌ కోర్ట్స్‌తో పాటు, చిన్నారులకు ప్లే ఏరియా వంటివి మాల్‌లో నిర్మించారు. ఈ మాల్‌ ద్వారా సుమారు 2 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇదిలా ఉంటే లులూ గ్రూప్‌ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే 5 ఏళ్లలో ఏకంగా రూ. 3500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లో శివారుతో పాటు తెలంగాణలోని పలు ప్రధాన పట్టణాల్లో మినీ మాల్స్‌ ఏర్పాటు చేసేందుకు లులూ గ్రూప్‌ ముందుకొచ్చింది.

2022లో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు లులూ గ్రూప్‌ ఒప్పందం చేసుకుంది. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఇందుకోసం ఒప్పందం జరిగింది. ఇక హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రముఖ పట్టణాల్లో సుమారు రూ. 1000 కోట్లతో మినీ మాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు లులూ గ్రూప్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..