AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం.. ప్రసంగిస్తూనే వ్యక్తి మృతి.. వీడియో..

ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుకుంటున్న వేళ, జెండా వందనం కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి మాట్లాడుతూనే, గుండె పోటుకు గురై హఠాన్మరణం చెందారు. ఈ షాకింగ్‌ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Hyderabad: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం.. ప్రసంగిస్తూనే వ్యక్తి మృతి.. వీడియో..
Hyderabad
Shaik Madar Saheb
|

Updated on: Aug 15, 2022 | 9:41 PM

Share

Independence Day 2022: మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. కాసేటి క్రితమే కనిపించిన వారు.. అకస్మాత్తుగా హఠాన్మరణం చెందుతుంటారు. ఇప్పుడు అలాంటి ఓ హృదయ విదారకమైన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అందరితో అప్పటివరకు కలిసి మెలసి ఉన్న ఓ వ్యక్తి హఠాన్మరణం చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుకుంటున్న వేళ, జెండా వందనం కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి మాట్లాడుతూనే, గుండె పోటుకు గురై హఠాన్మరణం చెందారు. ఈ షాకింగ్‌ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

కుషాయిగూడలోని కాప్రా పరిధిలో గల లక్ష్మి విల్లాస్‌లో ఉప్పల సురేష్ అనే వ్యాపారి జెండా వందనంలో పాల్గొన్నారు. అప్పటివరకు అందరితో మాట్లాడుతూ కనిపించారు. జెండా వందనం అనంతరం స్టేజ్‌పై ప్రసంగిస్తుండగా సురేష్‌ హఠాత్తుగా కుప్పకూలారు. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండె పోటు రావడంతో సురేష్‌ మృతి చెందినట్లు తెలిపారు.

వీడియో..

ఇవి కూడా చదవండి

భాగ్ అంబర్ పేట డిడి కాలనీలో ఉప్పల సురేష్ ఫార్మాస్యూటికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో కాప్రా, లక్ష్మి విల్లాస్‌ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. ఉప్పల సురేష్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి