AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొరపాట్లు నిజమే..చర్యలు తీసుకుంటాం- ఇంటర్‌ బోర్డు

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ అంగీకరించారు. ఇంటర్‌ బోర్డు పరీక్షా పత్రాలను పారదర్శకంగా, నాణ్యతతో కూడిన మూల్యాంకనం చేపట్టిందని, దాదాపు అంతా సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు.  ఏ ఒక్కరి జవాబు పత్రాలూ గల్లంతు కాలేదని, ప్రైవేటు సంస్థలపై ఆధారపడకుండా బోర్డే ఇంటర్‌ పరీక్షలను చేపట్టే ప్రక్రియలో భాగంగానే గ్లోబరీనా టెక్నాలజీ అనే సంస్థ సేవలు తీసుకున్నామని వెల్లడించారు. ఇంటర్‌ పరీక్షా ఫలితాల […]

పొరపాట్లు నిజమే..చర్యలు తీసుకుంటాం- ఇంటర్‌ బోర్డు
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 22, 2019 | 6:41 PM

Share

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ అంగీకరించారు. ఇంటర్‌ బోర్డు పరీక్షా పత్రాలను పారదర్శకంగా, నాణ్యతతో కూడిన మూల్యాంకనం చేపట్టిందని, దాదాపు అంతా సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు.  ఏ ఒక్కరి జవాబు పత్రాలూ గల్లంతు కాలేదని, ప్రైవేటు సంస్థలపై ఆధారపడకుండా బోర్డే ఇంటర్‌ పరీక్షలను చేపట్టే ప్రక్రియలో భాగంగానే గ్లోబరీనా టెక్నాలజీ అనే సంస్థ సేవలు తీసుకున్నామని వెల్లడించారు. ఇంటర్‌ పరీక్షా ఫలితాల వెల్లడిలో అవకతవకలు, ఇంటర్‌ విద్యార్థుల బలవన్మరణాల నేపథ్యంలో సోమవారం  విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల శ్రేణులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు ఇంటర్‌ బోర్డు ముందు పెద్ద ధర్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ఇంటర్‌ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అక్కడక్కడ కొన్ని తప్పిదాలు, పొరపాట్లు జరిగాయని, ముఖ్యంగా ముగ్గురు విద్యార్థుల పరీక్షా పత్రాలకు సంబంధించి మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయని చెప్పారు.  మూల్యాంకనంలో తప్పులు, పొరపాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షా పత్రాల మూల్యాంకనంలో పొరపాటు చేసిన వారిని ఇప్పటికే వివరణ అడిగామని, వారికి చార్జ్‌మెమో కూడా ఇస్తామని స్పష్టం చేశారు.