AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గజం భూమి రూ. 10 లక్షలేంటీ భయ్యా.! హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం మరో మాదాపూర్

హైదరాబాద్‌లో భూమి ధర ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట, గచ్చిబౌలి పేర్లు వినిపిస్తాయి. కానీ, వాటిని తలదన్నేలా బేగంబజార్‌లో భూమి ధర ముంబయితో పోటీ పడుతోంది.

Hyderabad: గజం భూమి రూ. 10 లక్షలేంటీ భయ్యా.! హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం మరో మాదాపూర్
Hyderabad Real Estate
Ravi Kiran
|

Updated on: Aug 18, 2024 | 1:16 PM

Share

హైదరాబాద్‌లో భూమి ధర ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట, గచ్చిబౌలి పేర్లు వినిపిస్తాయి. కానీ, వాటిని తలదన్నేలా బేగంబజార్‌లో భూమి ధర ముంబయితో పోటీ పడుతోంది. ముంబయిలో మాదిరిగా ఇక్కడ గజం భూమి తక్కువలో తక్కువ రూ.10 లక్షల వరకు పలుకుతోంది. భూమి లభ్యత లేకపోవడంతో పాత భవనాలే నూతన నిర్మాణాలకు పునాది వేస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహారాష్ట్రకు చెందిన హోల్‌సేల్‌ వ్యాపారులు ఎంతోమంది ఇక్కడే స్థిరపడ్డారు. చదరపు అడుగుల చొప్పున అమ్మకాలు జరిగే మడిగ దుకాణాల ధరలు కూడా రూ. కోట్లలోనే పలుకుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట భూములకు అత్యధిక ధరలు ఉన్న మాట నిజమే. కానీ, అంతకు మించిన ధరలు ఉస్మానియా ఆస్పత్రి సమీపంలోని బేగంబజార్‌లో పలుకుతున్నాయి. ముంబయిలో మాదిరిగా ఇక్కడ భూములకు ధరలు ఉన్నాయి. ఇక్కడ గల్లీ, వీధిని బట్టి గజానికి కనీస ధర రూ.10 లక్షలకు తక్కువ కాకుండా పలుకుతోంది.ఇక్కడ కొత్తగా స్థలాల లభ్యత లేదు. పాతవి, పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలే ఇక్కడి యజమానులకు రూ.కోట్లలో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఆ పాత భవనాల కోసం రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు నిరంతరం అన్వేషిస్తూనే ఉంటారు. పాత భవనం అమ్మకానికి ఉందన్న విషయం తెలిస్తే చాలు రెక్కలు కట్టుకుని క్షణాల్లో అక్కడ వాలిపోతారు. అందరి కంటే ఎక్కువగా ఇస్తామంటూ పోటీ పడుతుంటారు. ఒకరికి మించి ఇంకొకరు రేటు పెంచుకుంటూ పోతుంటారు. ఈ క్రమంలో వ్యాపారుల మధ్య పోటీ వేలం పాటను తలపిస్తుందంటే నమ్మశక్యం కాదు. భూమి యజమానికి కాసుల పంట కురిపించేలా పోటీ ఉంటుంది. పలు సందర్భాల్లో కొనుగోలుదారుల ఒత్తిడుల వల్ల అమ్మకందారుడు ‘టాస్‌’ వేసి మరీ ఆ స్థలాన్ని అమ్ముతుండడం విశేషం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో స్థిరంగా ఉన్న బేగం బజార్​ భూముల ధరలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 తర్వాత రెక్కలొచ్చాయి. రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర చెందిన హోల్‌సేల్‌ వ్యాపారులు ఎంతోమంది తమ వారిని రప్పించుకొని ఇక్కడే స్థిరపడ్డారు. రోజువారీ కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. చదరపు అడుగుల చొప్పున క్రయ విక్రయాలు జరిగే మడిగ దుకాణాల ధరలు కూడా రూ. కోట్లలోనే పలుకుతున్నాయి.