Hyderabad: బోనాల పండగ అని మటన్ తెచ్చుకుని తింటే ఇలా అయింది ఏంటి..?

హైదరాబాద్ వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో విచారకర ఘటన చోటుచేసుకుంది. బోనాల వేడుక అనంతరం మిగిలిన మటన్ తినడంతో ఓ కుటుంబంలోని 13 మంది అస్వస్థతకు గురవగా, వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వ్యక్తి TSRTC కండెక్టర్ అని సమాచారం.

Hyderabad: బోనాల పండగ అని మటన్ తెచ్చుకుని తింటే ఇలా అయింది ఏంటి..?
Mutton Curry

Edited By:

Updated on: Jul 25, 2025 | 12:18 PM

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వ‌ణ‌స్థలిపురం ఆర్టీసి కాలనీలో మటన్ తిని 13 మంది అస్వస్థతకు గురవగా.. ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి ఆర్టీసీ ఉద్యోగిగా గుర్తించారు. నిల్వ చేసిన మ‌ట‌న్ తిన‌డం వ‌ల్లనే అస్వస్థత‌కు గురైన‌ట్టు తెలుస్తోంది. బోనాల సందర్భంగా ఆదివారం మటన్ తెచ్చుకుని తినగా.. మిగిలిన దానిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని మరుసటిరోజు తినడంతో ఫుడ్ పాయిజన్ అయినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం ఆస్పత్రిలో 12మంది చికిత్స పొందుతుండ‌గా వారిలో కొందరి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

వివరాల్లోకి వెళితే, ఆదివారం (జూలై 21) బోనాల సందర్భంగా కుటుంబసభ్యులు పెద్దఎత్తున మటన్ వండించుకొని తిన్నారు. మిగిలిన మటన్‌ను ఫ్రిడ్జ్‌లో నిల్వచేసి, మరుసటి రోజు తిరిగి తినారు. అయితే అప్పటికే ఆ మాంసం వాడిపోయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే కారణంగా కుటుంబంలోని 13 మంది ఒకేసారి వాంతులు, డయ్యేరియా, తలనొప్పి వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు.

వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్న RTC ఉద్యోగి పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన 12 మంది చికిత్స పొందుతుండగా, వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us