AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: ‘దిశ’ నిందితుల అంత్యక్రియలకు హైకోర్టు మళ్లీ బ్రేక్

ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ నిందితుల అంత్యక్రియలకు హైకోర్టు మళ్లీ బ్రేక్ వేసింది. ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. అంతవరకు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి, అక్కడ భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఏసీ అంబులెన్స్‌లల్లో ఈ మృతదేహాలు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎన్‌కౌంటర్‌పై విచారణకు హైకోర్టు తరపున ప్రత్యేక న్యాయవాదిగా మాజీ ఏజీ ప్రకాష్ రెడ్డిని హైకోర్ట్ నియమించింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. హైకోర్టు […]

బ్రేకింగ్: 'దిశ' నిందితుల అంత్యక్రియలకు హైకోర్టు మళ్లీ బ్రేక్
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 09, 2019 | 5:39 PM

Share

ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ నిందితుల అంత్యక్రియలకు హైకోర్టు మళ్లీ బ్రేక్ వేసింది. ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. అంతవరకు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి, అక్కడ భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఏసీ అంబులెన్స్‌లల్లో ఈ మృతదేహాలు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎన్‌కౌంటర్‌పై విచారణకు హైకోర్టు తరపున ప్రత్యేక న్యాయవాదిగా మాజీ ఏజీ ప్రకాష్ రెడ్డిని హైకోర్ట్ నియమించింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

కాగా దిశ హత్యాచారం కేసులో నిందితులను రిమాండ్‌లోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం శుక్రవారం తెల్లవారుజామున దిశను కాల్చిన ప్రదేశానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నిందితులు, పోలీసుల మధ్య అనూహ్యంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌ చోటుచేసింది. ఉదయం గం.5.45 నుంచి గం.6.15నిమిషాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత వారి మృతదేహాలను మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. కానీ ఈ ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాలు హైకోర్టును ఆశ్రయించడంతో అంత్యక్రియలకు ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశంతో నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు.

Follow Us
హార్దిక్ కోసం 12 రోజుల సైకిల్ ప్రయాణం.. పాండ్యా రియాక్షన్ చూశారా?
హార్దిక్ కోసం 12 రోజుల సైకిల్ ప్రయాణం.. పాండ్యా రియాక్షన్ చూశారా?
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
మీ టైమ్ వచ్చేసింది భయ్యా..! ఈ రాశుల వారికి బాబా వంగా గుడ్‌న్యూస్
మీ టైమ్ వచ్చేసింది భయ్యా..! ఈ రాశుల వారికి బాబా వంగా గుడ్‌న్యూస్
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!