AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చల్లటి వర్షంలో వేడి వేడి బిర్యానీ.. హైదరాబాద్‌లో ఒక్కసారిగా పెరిగిన ఆర్డర్స్‌. ఏకంగా..

హైదరాబాద్‌లో గడిచిన రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోన్న విషయం తెలిసిందే. సూర్యుడు కనిపించక చాలా రోజులవుతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలంగా ఇంటికే పరిమితం అవుతున్నారు. అత్యవసరమైతే తప్ప అడుగు బయటకు పెట్టడం లేదు. ఇక విద్యా సంస్థలతో పాలు పలు ప్రభుత్వ సంస్థలకు సైతం సెలవులు ప్రకటించడంతో...

Hyderabad: చల్లటి వర్షంలో వేడి వేడి బిర్యానీ.. హైదరాబాద్‌లో ఒక్కసారిగా పెరిగిన ఆర్డర్స్‌. ఏకంగా..
Hyderabad
Narender Vaitla
|

Updated on: Jul 21, 2023 | 4:59 PM

Share

హైదరాబాద్‌లో గడిచిన రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోన్న విషయం తెలిసిందే. సూర్యుడు కనిపించక చాలా రోజులవుతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలంగా ఇంటికే పరిమితం అవుతున్నారు. అత్యవసరమైతే తప్ప అడుగు బయటకు పెట్టడం లేదు. ఇక విద్యా సంస్థలతో పాలు పలు ప్రభుత్వ సంస్థలకు సైతం సెలవులు ప్రకటించడంతో అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంకేముంది ఓవైపు చలి వణికిస్తుంటే మరోవైపు వేడి వేడిగా బిర్యానీలను లాగించేస్తున్నారు ప్రజలు. ఇంట్లో కూర్చొని ఎంచక్కా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టుకుంటున్నారు.

గడిచిన రెండు, మూడు రోజుల్లో భారీగా ఆర్డర్లే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతున్నారు. వర్షాలు మొదలైన తర్వాత స్విగ్గి, జొమాటోతో పాటు పలు ఇన్‌లైన్‌ డెలివరీ ఏజెన్సీలకు రోజులో ఏకంగా 1.30 లక్షల ఆర్డర్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒక్కసారిగా ఆర్డర్లు పెరగడంతో డెలివరీ బాయ్స్‌ ఆర్డర్స్‌ను అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ వ్యాప్తంగా మొత్తం 32 వేల మంది డెలివరీ బాయ్స్‌ ఉన్నారు.

సాధారణంగా వీరు రోజులో కనీసం 6 డెలివరీలు చేస్తుంటారు. అయితే వర్షం మొదలైన తర్వాత ఈ సంఖ్య ఏకంగా 12కి చేరడం విశేషం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఆర్డర్స్‌ భారీగా పెరిగినట్లు డెలివరీ బాయ్స్‌ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..