AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీరు బంద్

ఔటర్ రింగ్ రోడ్డు గ్రామాలకు మంచినీరు పంపిణీ చేసే పైపులైన్లకు ఇవాళ అధికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డులోని పలు గ్రామాలకు నీరు మంచినీరు నిలిచిపోనుంది. ఘన్‌పూర్, సైనిక్‌పురి మధ్య గోదావరి పైపులైన్, రింగ్ మెయిన్ పైపులైన్లకు జంక్షన్ పనులు చేపడుతున్నారు. దీంతో పైపులైన్ల పనులు కొనసాగుతుండటంతో ఇవాళ పలు కాలనీల్లో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 6.00 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు […]

నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీరు బంద్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 05, 2019 | 8:36 AM

Share

ఔటర్ రింగ్ రోడ్డు గ్రామాలకు మంచినీరు పంపిణీ చేసే పైపులైన్లకు ఇవాళ అధికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డులోని పలు గ్రామాలకు నీరు మంచినీరు నిలిచిపోనుంది. ఘన్‌పూర్, సైనిక్‌పురి మధ్య గోదావరి పైపులైన్, రింగ్ మెయిన్ పైపులైన్లకు జంక్షన్ పనులు చేపడుతున్నారు. దీంతో పైపులైన్ల పనులు కొనసాగుతుండటంతో ఇవాళ పలు కాలనీల్లో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 6.00 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. దీంతో హస్మత్‌పేట, పేట్‌బషీరాబాద్, బ్యాంక్ కాలనీ, మీనాక్షి, డిఫెన్స్ కాలనీ, అల్వాల్ మున్సిపల్ ఏరియా, లోతుకుంట, దమ్మాయిగూడ, హాకీంపేట్, సింగాయిపల్లి, దేవరయంజాల్, తూంకుంట, పోతాయిపల్లి, చర్లపల్లి, తుర్కపల్లి, అహ్మద్‌గూడ, మెస్ త్రిశూల్, గన్‌రాక్, కంటోన్మెంట్ బోర్డు, రుద్రనగర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.