Hyderabad: హైదరాబాద్కు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్.. ఎయిర్పోర్టులో అధికారుల ఘన స్వాగతం!
హైదరాబాద్ వేదికగా 2025 మిస్ వరల్డ్ పోటీల నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 7 నుంచి 31 వరకు హైదరాబాద్లో ఈ ప్రతిష్ఠాత్మక పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ క్రమంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ చేరుకున్న మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్, సీఈవో జూలియా ఈవేలిన్ మోర్లీకి శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు.

హైదరాబాద్ వేదికగా 2025 మిస్ వరల్డ్ పోటీల నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 7 నుంచి 31 వరకు హైదరాబాద్లో ఈ ప్రతిష్ఠాత్మక పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది. అయితే ఈ పోటీల్లో మొత్తం 120 దేశాలకు చెందిన యువతులు పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాదులో జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు.. లండన్ లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి శుక్రవారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జూలియా మోర్లీకి అధికారులు సాంప్రదాయపద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలోని అద్భుత వారసత్వాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చూపించడానికి ఇదో గొప్ప వేదిక అవుతుందన్నారు.
వీడియో చూడండి..
ఇక రేపటి నుంచే ఈ మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లను జూలియా సమీక్షించనున్నారు. మిస్ వరల్డ్ కాంటెండర్స్ పర్యటించే వివిధ ప్రాంతాలలో చేపట్టిన ఏర్పాట్లును ఆమె పరిశీలించనున్నారు , వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో సమీక్షించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
