AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: క్షణాల్లో ఆవిరైన కొలువొచ్చిన ఆనందం.. ఆర్టీసీ బస్సు రూపంలో వెంటాడిన మృత్యువు

బాగా చదువుకుని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలనుకుంది. కష్టపడి డిగ్రీ పూర్తి చేసి, కొరుకున్న కొలువు సొంతం చేసుకుంది ఆ యువతి. తన కలను నెరవేర్చిన దేవుడిని దర్శించుకుందాని తిరుపతి వెళ్లి వేంకటేశ్వర స్వామికి మొక్కులు కూడా చెల్లించుకొని తిరిగి వచ్చింది. అయితే ఇంతలోనే విధి అనూహ్య మలుపు తిప్పింది. కొలువు దక్కించుకున్న ఆనందాన్ని ఆస్వాదించకుండానే ఆర్టీసీ బస్సురూపంలో మృత్యువు..

Hyderabad: క్షణాల్లో ఆవిరైన కొలువొచ్చిన ఆనందం.. ఆర్టీసీ బస్సు రూపంలో వెంటాడిన మృత్యువు
RTC bus accident
Srilakshmi C
|

Updated on: Jul 11, 2024 | 9:29 AM

Share

ఆసిఫ్‌నగర్, జులై 11: బాగా చదువుకుని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలనుకుంది. కష్టపడి డిగ్రీ పూర్తి చేసి, కొరుకున్న కొలువు సొంతం చేసుకుంది ఆ యువతి. తన కలను నెరవేర్చిన దేవుడిని దర్శించుకుందాని తిరుపతి వెళ్లి వేంకటేశ్వర స్వామికి మొక్కులు కూడా చెల్లించుకొని తిరిగి వచ్చింది. అయితే ఇంతలోనే విధి అనూహ్య మలుపు తిప్పింది. కొలువు దక్కించుకున్న ఆనందాన్ని ఆస్వాదించకుండానే ఆర్టీసీ బస్సురూపంలో మృత్యువు కబలించింది. ఈ విషాదకర ఘటన హుమాయున్‌నగర్‌ ఠాణా పరిధిలోని ఆసిఫ్‌నగర్‌ ఆయిల్‌ మిల్లు రోడ్డులో మంగళవారం రాత్రి (జులై 9) చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సైదేశ్వర్, ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

హిమాయత్‌నగర్‌ అడ్వకేట్‌కాలనీలోని మద్రికా అపార్ట్‌మెంట్‌లో శ్రీనివాస్, వాణి అనే దంపతులు నివాం ఉంటున్నారు. వీరి కుమార్తె డి స్రవంతిరాణి (20) ఇటీవల డిగ్రీ పూర్తి చేసింది. ఈ నెల ఆరంభంలో జెన్‌ప్యాక్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం రావటంతో ఇంటిల్లిపాది ఆనందంతో తరించిపోయారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుపతి వెళ్లింది. తిరిగి మంగళవారం ఇంటికి వచ్చింది. తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదం ఆసిఫ్‌నగర్‌లో ఉండే మిత్రుడికి ఇచ్చేందుకు అదే రోజు రాత్రి ఆర్టీసీ బస్సులో వెళ్లింది. తిరిగి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు యత్నించగా..స్నేహితుడి కుటుంబసభ్యులు ఒంటరిగా వెళ్లొద్దని వారించారు. దీంతో స్నేహితుడి బైక్‌పై బయల్దేరింది స్రవంతిరాణి. అతను వెనక కూర్చోగా, స్రవంతి ముందు కూర్చుని బైక్‌ నడపసాగింది.

అయితే ఆసిఫ్‌నగర్‌ ఆయిల్‌ మిల్లు సమీపంలోని కాగానే ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి బయటికి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ సిటీ బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటన రాత్రి 10.22 సమయంలో జరిగింది. ఈ ప్రమాదంతో స్రవంతి బస్సు కింద పడి.. తీవ్రంగా గాయాలపాలైంది. స్థానికులు హుటాహుటీన బాధితురాలిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వేగంగా బస్సు నడిపిన డ్రైవర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ కరీంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హుమాయున్‌నగర్‌ ఎస్పై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బైక్‌ వెనుక కూర్చున్న మృతురాలి స్నేహితుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..