Late Night Party: పబ్‌లో లేట్ నైట్ పార్టీ.. పోలీసుల అదుపులో ఆర్ఆర్ఆర్ సింగర్..టాలీవుడ్ ప్రముఖులు, డ్రగ్స్ స్వాధీనం

Late Night Party: హైదరాబాద్‌(Hyderabad)లో లేట్ నైట్ పార్టీ కల్చర్ రోజు రోజుకీ అధికమవుతుంది. తాజాగా సమయం దాటినా జరుగుతున్నా లేట్ నైట్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బంజారాహిల్స్‌(Banjara Hills)లోని..

Late Night Party: పబ్‌లో లేట్ నైట్ పార్టీ.. పోలీసుల అదుపులో ఆర్ఆర్ఆర్ సింగర్..టాలీవుడ్ ప్రముఖులు, డ్రగ్స్ స్వాధీనం
Hyderabad Rave Party 1
Follow us

|

Updated on: Apr 03, 2022 | 12:12 PM

Late Night Party: హైదరాబాద్‌(Hyderabad)లో లేట్ నైట్ పార్టీ కల్చర్ రోజు రోజుకీ అధికమవుతుంది. తాజాగా సమయం దాటినా జరుగుతున్నా లేట్ నైట్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బంజారాహిల్స్‌(Banjara Hills)లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో లేట్ నైట్ పార్టీని నిర్వహిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఫుడింగ్ మింక్ పబ్‌పై మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడులు నిర్వహించారు. ఈ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ ఖమ్మం మాజీ ఎంపీ కూతురు నుంచి ఓ ప్రముఖ వ్యక్తి ఒక ఏడాది క్రితం లీజ్ తీసుకున్నట్లు గుర్తించారు. ఈ పబ్ లో ఆరు గ్రాముల కొకైన్ దొరికింది. ఫుడింగ్ అండ్ మింక్ ఫై పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతేకాదు లేట్ పార్టీలో 150 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదుపులోకి తీసుజున్న వారిలో పబ్ యజమానితో సహా సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టాలీవుడ్ ప్రముఖ హీరో తనయ, సీనియర్ నటుడు కుమార్తె కూడా ఉన్నట్లు సమాచారం. 39 మంది యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. అయితే 150 మంది లో 145 మందిని పోలీసులు కండిషన్స్ తో వదిలి పెట్టారు. 5 గురిని మాత్రమే పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఇలా పోలీసు అదుపులో ఉన్న వారిలో ప్రముఖ హీరో కూతురు ఉన్నట్లు సమాచారం. ప్రముఖ హీరో, మేనల్లుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు దాడి చేయడంతో డ్రగ్స్ ను బాత్ రూములో , కిటికిలో నుంచి డ్రగ్స్ బయట పడేసినట్లు తెలుస్తోంది. ఫుడింగ్ మింక్ పబ్ బాతురూములో దొరికిన కొకైన్ ను టాస్క్ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. అంతేకాదు కిటిలోనుంచి బయటపడిన 12 ప్యాకెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే పబ్ బంజారాహిల్స్ పీఎస్ కి అతిసమీపంలో ఉంది. దీంతో పోలీసుల నిర్లక్ష్యం పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా రాడిసన్ పబ్ పై గతంలో కూడా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది. పబ్ మాజీ ఎంపీ కూతురుది కావడం తో చూసి చూడనట్లు బంజారాహిల్స్ పోలీసులు వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి మూడు గంటలు వరకు పబ్ నడిచినా పబ్ పై కన్నెత్తి చూడని బంజారాహిల్స్ పోలీసులు అంటూ ఆరోపణలు చేస్తున్నారు స్థానికులు

Also Read: Butter Milk: వేసవిలో పెరుగు కంటే మజ్జిగ ఆరోగ్యానికి మేలు..మజ్జిగను భూలోక అమృతం అంటారు ఎందుకో తెలుసా..

Latest Articles