AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెట్రో ప్రయాణికులకు శుభవార్త…మరో పదిరోజుల్లో..

హైదరాబాద్ మెట్రో...ప్రయాణికులకు శుభవార్త...ప్రయాణికులకు మరింత సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు కృషి చేస్తున్న హైదరాబాద్ మెట్రో...ప్రయాణికుల సౌలభ్యం కోసం త్వరలో ...

మెట్రో ప్రయాణికులకు శుభవార్త...మరో పదిరోజుల్లో..
Jyothi Gadda
|

Updated on: Mar 06, 2020 | 8:11 AM

Share

హైదరాబాద్ మెట్రో…ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం త్వరలో మెట్రో పాసులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హైదరాబాద్ మెట్రో సంస్థ స్పష్టం చేసింది. పేటిఎంతో సులభతర టికెటింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు హైదరాబాద్‌ మెట్రో అధికారులు. ఈ సందర్బంగా మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ మెట్రో పాస్‌లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

డిజిటల్‌ లావాదేవీల్లో తెలంగాణ రాష్ట్రం ముందజలో ఉందన్నారు మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి. ప్రయాణికులకు మరింత సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. ముందు ముందు తాము ఆర్టీసీ, ఊబర్‌ వంటి ప్రైవేటు సంస్థలతో కూడా ఒప్పందాలు చేసుకుని ఒకే టికెట్‌తో ప్రయాణం చేసేలా సదుపాయాలు తెచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రెండు మూడు వారాల్లో పాస్‌లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 46కిలోమీటర్ల ట్రాక్ పరిధిలో 8 ఆర్‌ఒబిఎస్‌లు నిర్మించామని ఆయన వెల్లడించారు. సామాన్య ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిర్మాణం చేశామని చెప్పారు. పేటియం కల్పిస్తున్న నూతన సదుపాయాలతో మరింత సౌకర్యవంతగా ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చన్నారు. అలాగే ప్రజలు మెట్రో రైలులో ప్రయాణించేప్పుడు కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.