చార్మినార్ వద్ద బంగారం చోరీ కలకలం.. మహిళలకు పోలీసుల హెచ్చరిక!
Hyderabad old city crime news: ఎక్కడెక్కడి నుంచో వచ్చి చారిత్రాత్మక కట్టడమైన చార్మినార్ ను తనివితీరా సందర్శించి, ఆ పరిసర ప్రాంతాల్లో గడుపుతారు. అంతటి ప్రాధాన్యత ఉన్న చార్మినార్ ప్రాంతంలో తాజాగా బంగారం చోరీ జరగడం కలకలం రేపుతోంది. హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే చార్మినార్ ప్రాంతంలో బంగారం దొంగతనం ఘటన ప్రజా భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తోంది.

చార్మినార్ సాక్షిగా చోరీ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ నగరానికే తలమానికమైన చార్మినార్ సందర్శనకు దేశ విదేశాల నుంచి తరలివస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చారిత్రాత్మక కట్టడమైన చార్మినార్ ను తనివితీరా సందర్శించి, ఆ పరిసర ప్రాంతాల్లో గడుపుతారు. అంతటి ప్రాధాన్యత ఉన్న చార్మినార్ ప్రాంతంలో తాజాగా బంగారం చోరీ జరగడం కలకలం రేపుతోంది. హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే చార్మినార్ ప్రాంతంలో బంగారం దొంగతనం ఘటన ప్రజా భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తోంది.
అసలేం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం ఏప్రిల్ 12న సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో షనాజ్ ఖదీర్ అనే మహిళ తన కూతురితో కలిసి బంగారు నగలను పాలిష్ చేయించేకునేందుకు వెళ్లింది. రాబోయే ఈద్-ఉల్-అజ్హా తర్వాత జరగబోయే తన కూతురి వివాహం కోసం ఏర్పాట్లలో భాగంగా బంగారం పాలిష్ చేయించేందుకు చార్మినార్ ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 4 తులాల విలువ గల బంగారు ఆభరణాలు (రెండు గాజులు, ఒక హారం, ఒక లాకెట్) తీసుకుని గుల్జార్ హౌస్, చార్మినార్ ప్రాంతానికి వెళ్లినట్లు బాధిత మహిళ పేర్కొన్నారు. షనాజ్ ఖదీర్ తల్హా మస్జిద్, భవానీ నగర్, తలాబ్కట్ట (యాకుత్పుర అసెంబ్లీ నియోజకవర్గం) నివాసిగా తెలుస్తోంది.
మొదట గుల్జార్ హౌస్ సమీపంలోని కరీమ్ జ్యువెలర్స్ వద్ద బంగారం పాలిష్ నిమిత్తం విచారించగా.. అక్కడ అధిక ధర చెప్పడంతో ఆమె తన బంగారం తిరిగి పర్స్లో పెట్టుకుని ఎదురుగా ఉన్న మసూద్ జ్యువెలర్స్ వైపు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత పర్స్ను పరిశీలించగా మొత్తం బంగారం కనిపించకపోవడంతో షాక్కు గురై రోడ్డుపైనే మూర్చిపోయారు. స్పృహలోకి వచ్చిన అనంతరం చోరీ విషయాన్ని గుర్తించి, ఆ వెంటనే చార్మినార్ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గత రెండు రోజులుగా పలుమార్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారించగా.. సీసీటీవీ ఫుటేజ్ స్పష్టంగా లేదని, నిందితులను గుర్తించలేకపోతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాధిత మహిళ షనాజ్ ఖదీర్.. చోరీకి గురైన సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు నగలను తిరిగి పొందేందుకు చార్మినార్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఘటనపై FIR నం. 86/2026 ను BNS సెక్షన్ 303(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగార్జున తెలిపారు. గుల్జార్ హౌస్ పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి, బాధితురాలి సమాచారం మేరకు అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఈ ప్రాంతంలో తరచూ చోరీ ఘటనలు చోటు చేసుకోవడం, దొంగతనం జరిగిన అనంతరం సీసీటీవీ కెమెరాలు సరిగా పని చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మరియు చార్మినార్ జోన్ డీసీపీ తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా చార్మినార్ ప్రాంతంలో కఠినమైన పర్యవేక్షణ, సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు, మరియు పోలీస్ పహారా పెంచాలని కోరారు.
