Ganga Pushkaralu 2023: గంగా పుష్కారాలకు వెళ్లేవారికి శుభవార్త.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..

Ganga Pushkaralu 2023: దక్షిమ మధ్య రైల్వే గంగా పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22 నుంచి మే 5 వరకు జరిగే గంగా పుష్కరాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను..

Ganga Pushkaralu 2023: గంగా పుష్కారాలకు వెళ్లేవారికి శుభవార్త.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..
Special Trains For Ganga Pushkaralu
Follow us

|

Updated on: Apr 21, 2023 | 6:27 PM

Ganga Pushkaralu 2023: దక్షిమ మధ్య రైల్వే గంగా పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22 నుంచి మే 5 వరకు జరిగే గంగా పుష్కరాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు నుంచి వేర్వేరుగా మూడు ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు ఆయా ప్రత్యేక రైళ్ల టైమింగ్స్, గమ్యస్థానల వివరాలను పేర్కొంటూ.. అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి వెళ్లే ప్రత్యేక రైళ్లు..

సికింద్రాబాద్ నుంచి రక్సోల్(07007):

ఈ నెల 22 నుంచి గంగా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి రక్సోల్ వరకు నడిచే ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్-వారణాసి మీదుగా రక్సోల్ చేరుకుంటుంది. ఏప్రిల్ 23, ఏప్రిల్ 30, మే 7 తేదీలలో సికింద్రాబాద్ నుంచి రక్సోల్‌కి ప్రతి ఆదివారం రాత్రి 10: 30 నిముషాలకు ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

తిరుపతి నుంచి దానాపూర్(07419):

సికింద్రాబాద్ నుంచి రక్సోల్ వరకు నడిచే ప్రత్యేక రైలు మాదిరిగానే తిరుపతి నుంచి దానాపూర్‌కి కూడా మరో స్పెషల్ ట్రైన్ ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ తిరుపతి నుంచి ప్రయాగ్ రాజ్-వారణాసి మీదుగా దానాపూర్ చేరుతుంది. ఇక ఈ ట్రైన్ ఏప్రిల్ 22 & 29 అలాగే, 06 మే తేదీలలో తిరుపతి నుంచి ప్రారంభమవుతుంది.

గుంటూరు నుంచి బెనారస్(07230):

గంగా పుష్కరాలకు వెళ్లే వారి కోసం గుంటూరు నుంచి కూడా ప్రత్యేక రైలు ఉంది. ఈ ట్రైన్ గుంటూరు నుంచి ప్రయాగ్ రాజ్ మీదుగా బెనారస్ వరకు వెళ్తుంది. ఏప్రిల్ 22 & 29 అలాగే, 06 మే తేదీలలో ఇది నడుస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం