AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంపేస్తున్నారు.. ముక్కలుగా నరికేస్తున్నారు! ఆ టైంలో నేరస్థుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే..

ప్రస్తుత సమాజంలో ప్రేమ, పగ, ప్రతీకారం, కోపం, ద్వేషం, అనుమానం వంటి కారణాలతో సన్నిహితుల మధ్య దారుణమైన నేరాలు పెరుగుతున్నాయి. మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరకడం వంటి కిరాతక చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫోరెన్సిక్ మెడికల్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ నారాయణ రెడ్డి, టీవీ9 డికోడ్ విత్ నేత్ర కార్యక్రమంలో ఈ నేరాల వెనుక ఉన్న మానసిక, సామాజిక కారణాలను లోతుగా విశ్లేషించారు..

చంపేస్తున్నారు.. ముక్కలుగా నరికేస్తున్నారు! ఆ టైంలో నేరస్థుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే..
Brutal Crimes In Society
Srilakshmi C
|

Updated on: May 06, 2026 | 6:43 PM

Share

హైదరాబాద్‌, మే 6: ప్రొఫెసర్ నారాయణ రెడ్డి నేటి సమాజంలో పెరుగుతున్న కిరాతక నేరాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా హత్య అనంతరం శవాలను ముక్కలుగా నరకడం వంటి అంశాలపై నిందితుల మానసిక విషయాలను విశ్లేషిస్తారు. ప్రేమ, పగ, ఆర్థిక సమస్యలు, మానసిక బలహీనత వంటి అంశాలు నేరాలకు ఎలా దారితీస్తున్నాయో కూడా వివరించారు. సాక్ష్యాలను మాయం చేయడానికి ఈ తరహా చర్యలకు నిందితులు పాల్పడుతున్నట్లు తెలిపారు.

ప్రస్తుత సమాజంలో క్రూరమైన నేరాలు, ముఖ్యంగా హత్యల తర్వాత డెడ్ బాడీ శరీర భాగాలను ముక్కలుగా నరకడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫోరెన్సిక్ మెడికల్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ నారాయణ రెడ్డి దీనిపై విశ్లేషించారు. సాక్ష్యాలను నాశనం చేయడానికి, మృతదేహాన్ని గుర్తు పట్టకుండా పారవేయడానికే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం వివాహేతర సంబంధాల కోసం ఏర్పడిన బంధాలు విడిపోయే క్రమంలో పగ, ప్రతీకారాలు పెరిగి ఈ దారుణాలకు దారితీస్తున్నాయని తెలిపారు. ఇందుకు ఢిల్లీలోని శ్రద్ధా హత్య కేసు, హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ యాసిడ్ దాడి వంటి కేసులను ఆయన ఉదాహరించారు. ఆర్థిక సమస్యలు, ఒంటరితనం, మానసిక దౌర్బల్యం వంటివి కుటుంబ ఆత్మహత్యలకు కారణమని అన్నారు. అలాగే తల్లిదండ్రులే తమ కడుపున పుట్టిన పిల్లలను చంపేయడానికి కూడా ఇవే కారణమవుతున్నాయని ప్రొఫెసర్ రెడ్డి నారాయణ రెడ్డి వివరించారు.

ఇవి కూడా చదవండి

మృతదేహాలను ముక్కలుగా నరకడం అనేది రెండు సందర్భాల్లో జరుగుతుందని ఆయన వివరించారు. ఒకటి హత్య చేసేటప్పుడే కిరాతకంగా నరకడం. రెండవది, చంపిన తర్వాత శవాన్ని గుర్తించకుండా చేసి, సాక్ష్యాలను మాయం చేయడానికి ముక్కలుగా నరకడం. 1970లో అనంతపూర్ జిల్లాకు చెందిన కెప్టెన్ నాగరాజ్ తన ప్రియురాలిని చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి హుస్సేన్ సాగర్ చెరువులో పారవేసిన ఘటనను ఆయన ఉదాహరించారు. ఇది కొత్త పోకడ కాదని, అప్పట్లోనూ ఇలాంటివి జరిగాయని, అయితే మీడియా చురుకుగా ఉండటం వల్ల ప్రస్తుతం ఎక్కువ వెలుగులోకి వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us