AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మంచి నూనెగా భావించి పురుగుల మందుతో వంట.. భార్య మృతి, భర్త పరిస్థితి సీరియస్..

Telangana: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని మహిళ పురుగుల మందునే మంచినూనెగా భ్రమించింది.

Telangana: మంచి నూనెగా భావించి పురుగుల మందుతో వంట.. భార్య మృతి, భర్త పరిస్థితి సీరియస్..
Shiva Prajapati
|

Updated on: Aug 13, 2022 | 10:05 AM

Share

Telangana: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని మహిళ పురుగుల మందునే మంచినూనెగా భ్రమించింది. దానితో వండిన కూరను తాను తినటమే కాక భర్తకు, కుమార్తెకు సైతం వడ్డించింది. ఈ క్రమంలో ఆమె మృత్యువాత పడింది. భర్త ఆసుపత్రిలో కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటనపై తిరుమలాయపాలెం పోలీసు స్టేషన్ పరిథిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మేడిదపల్లికి చెందిన బండ్ల నాగమ్మ మానసికస్థితి సరిగాలేక ఇబ్బందిపడుతోంది. ఇంట్లో మంచినూనెకు బదులుగా పక్కనున్న పురుగుమందుతో కూర వండింది. అనంతరం కూరతో తాను అన్నం తిని, చేలో పనిచేస్తున్న భర్త పుల్లయ్య, కూతురు పల్లవిలకు తీసుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న పుల్లయ్య కొంతమేర ఆ అన్నాన్ని తిన్నాడు. మందువాసన రావటంతో కుమార్తె అన్నాన్ని పడేసింది. నాగమ్మ అపస్మాకరస్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన స్థానికులు ఇద్దరిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగమ్మ మృతిచెందింది. పుల్లయ్యకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..