AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముగిసిన కవిత విచారణ.. కీలక వివరాలు సేకరించిన సీబీఐ..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. ఇవాల్టికి విచారణ పూర్తాయింది. ఎమ్మెల్సీ కవితను ఆదివారం బంజారాహిల్స్‌లోని ఆమె ఇంట్లోనే సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముగిసిన కవిత విచారణ.. కీలక వివరాలు సేకరించిన సీబీఐ..
Mlc Kavitha
Shaik Madar Saheb
|

Updated on: Dec 11, 2022 | 6:36 PM

Share

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ పూర్తయింది. కవితను.. సీబీఐ అధికారులు ఏడు గంటలకు పైగా విచారించారు. ఎమ్మెల్సీ కవితను ఆదివారం బంజారాహిల్స్‌లోని ఆమె ఇంట్లోనే సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకు ఆమె ఇంట్లోకి వెళ్లిన సీబీఐ బృందం ఏకధాటిగా విచారణ కొనసాగించింది. మొత్తం రెండు వాహనాల్లో ఆరుగురు సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చారు. ఈ బృందంలో ఒక మహిళా సీబీఐ అధికారి కూడా ఉన్నారు. స్టేట్ మెంట్ రికార్డు అనంతరం.. సీబీఐ అధికారులు సాయంత్రం కవిత ఇంటినుంచి వెళ్లిపోయారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సాక్షిగా కవిత నుంచి.. సీబీఐ అధికారులు పలు కీలక వివరాలు సేకరించారు. సీబీఐ డీఐజీ రాఘవేంద్ర నేతృత్వంలో విచారణ జరిగింది. విచారణ అనంతరం కవిత ప్రగతి భవన్‌కి బయలుదేరనున్నట్లు సమాచారం. సీబీఐ విచారణ జరిగిన తీరును కవిత కేసీఆర్‌కు వివరించనున్నారని పేర్కొంటున్నారు. కాగా, ఈ విచారణపై సీఎం కేసీఆర్, కవిత న్యాయనిపుణులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సీబీఐ DIG రాఘవేంద్ర ఆధ్వర్యంలో కవిత స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు. లిక్కర్ స్కాంకి సంబంధించి కీలక అంశాలపై ఆమె వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది. కవిత అడ్వకేట్‌ సమక్షంలో ఆమె స్టేట్మెంట్‌ను నమోదు చేశారు. మనీష్‌ సిసోడియా పాత్రతో పాటు పలు అంశాలపై సీబీఐ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..