AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chit Fund Fraud: కిలాడి దంపతులు.. చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.2.5 కోట్లతో రాత్రికి రాత్రే..

Couple Chit Fund Fraud in Dundigal: సడెన్‌గా ఆ ఇంటిముందు జనం గుమిగూడారు. ఏమైందోనని కంగారు పడ్డారంతా.. ఎవరైనా చనిపోయారో ఏమోనని ఆరాతీశారు. కానీ అసలు విషయం తెలిసి వారంతా అవాక్కయ్యారు.

Chit Fund Fraud: కిలాడి దంపతులు.. చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.2.5 కోట్లతో రాత్రికి రాత్రే..
Dundigal Chit Fund Fraud
Shaik Madar Saheb
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 07, 2022 | 9:12 AM

Share

Couple Chit Fund Fraud in Dundigal: సడెన్‌గా ఆ ఇంటిముందు జనం గుమిగూడారు. ఏమైందోనని కంగారు పడ్డారంతా.. ఎవరైనా చనిపోయారో ఏమోనని ఆరాతీశారు. కానీ అసలు విషయం తెలిసి వారంతా అవాక్కయ్యారు. అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.. వారంతా చిన్నాచితక పనులు చేస్తూ జివనం సాగించే సామాన్యులు. పైసాపైసా కూడబెట్టే వారిపై ఫ్రాడ్‌ కపుల్‌ కన్ను పడింది. ఇంకేముంది, పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు ఆ దంపతులు. మాయ మాటలు చెప్పి, పేద ప్రజలతో చీటీలు కట్టించారు. కోట్లలో ధనం చేతికొచ్చింది. దీంతో వారి దుర్భుద్దిని బయటపెట్టారు ఆ కంత్రీ కపుల్. దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో (Chit Fund Fraud) ఉడాయించారు. దీంతో లబోదిబోమంటున్నారు బాధితులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ (Dundigal) ఏరియా సూరారంలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు వేసిన వారిని నమ్మించి 2.5 కోట్ల రూపాయలతో ఉడాయించారు దంపతులు.

సురారం కాలనీ రాజీవ్ గృహకల్ప 11వ బ్లాక్ ఎదురుగా కిరణా దుకాణం నిర్వహిస్తున్నారు మద్దిరాల పద్మ, విజయ్‌కుమార్ దంపతులు. ఇరవై ఏళ్లుగా అక్కడే నివాసముంటున్నారు. 15 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు ఆ దంపతులు. వారిని నమ్మి చిట్టీలు వేస్తున్నారు స్థానికులు. తాజాగా భారీ మొత్తంలో నగదు కూడబెట్టుకుని రాత్రికి రాత్రే చెక్కేశారు. అనుమానం వచ్చిన స్థానికులు, పద్మ ఇంటికి రాగా అసలు విషయం తెలిసి బాధితులు గుండెలు బాదుకుంటున్నారు.

మోసపోయామని గుర్తించిన బాధితులు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులంతా పద్మ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. 120 మంది వద్ద 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసి, నగదుతో ఉడాయించారని ఆరోపిస్తున్నారు బాధితులు. ఇటీవలే ఆ పందతులు నివసించే ఇల్లును కూడా అమ్మేసినట్టు చెబుతున్నారు స్థానికులు.

Also Read:

AP Crime News: అనంతపురంలో ఘోరం.. నడిరోడ్డుపై దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే..

Anantapur Accident: పెళ్లింట చావు మేళం.. ఇంటికి వస్తుండగా కబళించిన మృత్యువు.. 9 మంది మృతి

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..